3 Capitals: ఒకే రాష్ట్రం ఒకే రాజధాని : ఏపీ సీఎం జగన్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని అమరావతి మాత్రమే ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం హైకోర్టుకు తెలియజేశారు. ఈ ప్రకటనతో మూడు రాజధానుల

Published By: HashtagU Telugu Desk
cm jagan

ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని అమరావతి మాత్రమే ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం హైకోర్టుకు తెలియజేశారు. ఈ ప్రకటనతో మూడు రాజధానుల బిల్లులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నందున దానిని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి మూడు వేర్వేరు రాజధానులను ప్రతిపాదించింది. శాసనసభ రాజధాని అమరావతి, కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు. అమరావతి మాత్రమే రాజధాని అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు రెండేళ్లుగా ఉద్యమిస్తున్న రైతులది గొప్ప విజయం. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించనున్న కొత్త బిల్లును ప్రభుత్వం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. మరి బిల్లు ఎలా ఉంటుందో చూడాలి.

2019, డిసెంబర్‌ 17న మూడు రాజధానులు పెట్టుకోవచ్చంటూ అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన చేశారు. పాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతి ఉండవచ్చని చెప్పిన జగన్‌. దీనితో ఒక్కసారి 29 రాజధాని గ్రామాల్లో కలకలం రేగింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అనేక రాజధాని గ్రామాల్లో రిలే నిరాహారదీక్ష శిబిరాలు ప్రారంభమయ్యాయి. 2020, జనవరి 20న శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లు, ఆమోదముద్ర పడింది. విశాఖ, కర్నూలు, అమరావతి మూడు చోట్ల రాజధానులను వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.

  Last Updated: 22 Nov 2021, 04:11 PM IST