Free Bus Travel For Women: ఏపీలో మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం (Free Bus Travel For Women) ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ ఉచిత బస్సు పథకం కేవలం జిల్లాలకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అధికారులు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇకపోతే ఫ్రీ బస్సుకు సంబంధించిన త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు
ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కలిపిస్తున్నట్టు తెలిపిన సీఎం చంద్రబాబు https://t.co/NEiVrHedL7 pic.twitter.com/n116M0KR6S
— Telugu Scribe (@TeluguScribe) May 17, 2025
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆగస్టు 15, 2025 నాటికి ప్రారంభం కానుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. ఈ పథకం కూటమి పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చేర్చిన ‘సూపర్ సిక్స్’ హామీలలో ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ నడిపే సాధారణ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.
ఈ పథకం మహిళల సామాజిక, ఆర్థిక స్థితిని ఉన్నతం చేయడం, రవాణా ఖర్చులను తగ్గించి స్వతంత్రతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం అమలుకు భారీగా బడ్జెట్ను కేటాయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో డ్రైవర్ల శిక్షణ, రవాణా సంస్థ ఆర్థిక స్థిరత్వం కోసం రీయింబర్స్మెంట్ ఖర్చులు కూడా ఉన్నాయి.
Also Read: Amavasya 2025: మే నెలలో అమావాస్య తిథి ఎప్పుడు వస్తుంది? దాని ప్రాముఖ్యత ఏమిటి!
అయితే ఈ పథకం అమలులో ఆర్థిక సవాళ్లు ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ప్రస్తుతం 10,000 బస్సులను నడుపుతుండగా ఈ పథకం వల్ల 30% అధిక ఆక్యుపెన్సీ రేటు రావచ్చని అంచనా. దీనికి అదనపు బస్సులు, మానవ వనరులు అవసరం. ఈ సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో అమలవుతున్న ఇలాంటి పథకాలను అధ్యయనం చేసింది. కర్ణాటకలో ‘శక్తి’ పథకం కింద 2,000 అదనపు బస్సులు, 9,000 సిబ్బందిని నియమించారు, ఇది ఏపీకి మార్గదర్శకంగా ఉండవచ్చు. గతంలో ఈ పథకం ఆగస్టు 15, 2024 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటనలు వచ్చినప్పటికీ ఆర్థిక సమస్యలు, బస్సుల కొరత వల్ల ఆలస్యం జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ, టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశాయి.