Site icon HashtagU Telugu

Somu Veerraju: ఏపీ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తుంది: సోము వీర్రాజు

Somu Veerraju

Somu Veerraju

ఇటీవల ఏపీ ప్రభుత్వం దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కుల హోదా కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజు రియాక్ట్ అవుతూ.. ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తుందని అన్నారు. దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలంటూ శాసనసభలో చేసిన తీర్మానాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు.

సోమవారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో తీర్మానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన దీక్షకు నాయకత్వం వహించిన వీర్రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రైస్తవులను మభ్యపెడుతున్న తీరును ఇది ప్రతిబింబిస్తోందన్నారు. చర్చిల నిర్మాణానికి విలువైన ప్రభుత్వ భూములను సీఎం కేటాయించారని, దానికి బీజేపీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. గత కొన్నేళ్లుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని వీర్రాజు అన్నారు.

రాష్ట్రంలో ‘హిందూ ధర్మం’ పట్ల ద్వేషం వ్యాప్తి చెందుతోంది. మైనారిటీలను మభ్యపెట్టడం, హిందూ దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి రాజకీయాలను బీజేపీ సహించదు. “(దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించే అంశం) సుప్రీం కోర్టు తీర్పు పెండింగ్‌లో ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానాన్ని ఎలా ముందుకు తెస్తుంది” అని వీర్రాజు ప్రశ్నించారు.

Exit mobile version