Ramadan 2025 : ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

Ramadan 2025 : ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తూ, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు

Published By: HashtagU Telugu Desk
Ap Government Good News For

Ap Government Good News For

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం (Ramadan Masam) ప్రారంభం కానున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ముస్లిం ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తూ, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు విధుల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

New UPI Rule: యూపీఐ లావాదేవీలు.. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి కీల‌క మార్పు!

ఈ సడలింపు మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని స్పష్టంగా తెలియజేసింది. రంజాన్ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తార్ కోసం ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక సడలింపులు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. గతంలో కూడా ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలను అమలు చేశాయి.

ఉద్యోగుల ఆరాధనకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సడలింపు ద్వారా ముస్లిం ఉద్యోగులు ఉపవాస దీక్షను మరింత నిబద్ధతతో పాటించేందుకు అవకాశం లభిస్తుంది. రంజాన్ మాసంలో ఉపవాసం పాటించే వారి శారీరక స్థితిని దృష్టిలో ఉంచుకొని, పని భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముస్లిం ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. తమ విశ్వాసాలకు ప్రభుత్వం గౌరవం ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  Last Updated: 12 Feb 2025, 08:57 PM IST