YS Vijayalakshmi Car Accident: విజయమ్మకు తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి ప్రమాదం నుంచి బయటపడ్డారు.

  • Written By:
  • Updated On - August 11, 2022 / 03:12 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి ప్రమాదం నుంచి బయటపడ్డారు. వైఎస్ఆర్ స్నేహితుడి కుటుంబాన్ని కలిసేందుకు ఆమె గురువారం కర్నూలుకు వచ్చారు. ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్‌ పగిలిపోవడంతో  కారు అదుపు తప్పింది. అదృష్టవశాత్తూ డ్రైవర్‌తో సహా ఎవరికీ ఎటువంటి గాయాలు, ప్రాణనష్టం జరగలేదు. విజయలక్ష్మిని కారులో నుంచి రక్షించి మరో కారులో అక్కడి నుంచి పంపించారు. ఇటీవలి కాలంలో కుమార్తె షర్మిలతో కలిసి విజయలక్ష్మి హైదరాబాద్‌లో ఉంటోంది. తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించి షర్మిలకు సహాయం చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి ఇటీవలే రాజీనామా చేశారు.