YSR Rythu Bharosa: 52.3 లక్షల మంది రైతుల అకౌంట్లోకి రూ.5,500 జమ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో మొదటి విడత కింద అర్హులైన 52.3 లక్షల మంది రైతులకు రూ.5,500 ఆర్థిక సహాయాన్ని జమ చేశారు.

YSR Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో మొదటి విడత కింద అర్హులైన 52.3 లక్షల మంది రైతులకు రూ.5,500 ఆర్థిక సహాయాన్ని జమ చేశారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులనుద్దేశించి పలు అంశాలపై మాట్లాడారు. .

సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు సుభిక్షంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం మీ కుమారుడి ప్రభుత్వం అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. రుణాలు పొందడం కష్టమని భావించిన రైతులు పంటలు పండించేటప్పుడు ఇబ్బందులు పడొద్దని తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద మూడు విడతలుగా భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులందరికీ రూ.13,500 ఆర్థిక సహాయం అందజేస్తుంది. గడిచిన నాలుగేళ్లలో ఈ పథకం కింద రాష్ట్రం రూ.30,985 కోట్లు పంపిణీ చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో నాలుగేళ్లకు రూ.12,500 సాయం అందజేస్తామని హామీ ఇచ్చామని అయితే దానికి బదులు రూ.13,500 అందించామని సీఎం అన్నారు. దీంతో రైతులకు అదనంగా రూ.17,500 నిధులు అందజేశారన్నారు సీఎం జగన్.

ధాన్యం కొనుగోలు విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని సీఎం చెప్పారు. ఆర్బికేల ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని, ఆర్బికే ద్వారా దళారులకు చోటులేకుండా చేశామని అన్నారు. ఈ నాలుగేళ్ళ పాలనలో ధాన్యం సేకరణకు గానూ 60 వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇక వందేళ్ల తరువాత భూసర్వే జరుగుతుందని, సమగ్ర భూసర్వేతోనే భూవివాదాలు పరిష్కారమవుతాయని సీఎం అన్నారు.

Read More: Akshintalu: ఆశీర్వదించినప్పుడు అక్షింతలు ఎందుకు వేస్తారో తెలుసా?