AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్‎లో ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే !!

ఈ బడ్జెట్ కేవలం అంకెలకు పరిమితం కాకుండా, 'స్వర్ణాంధ్ర విజన్-2047' కి బలమైన పునాది వేసేలా రూపొందించబడింది. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యంగా నిధుల కేటాయింపులు జరిగాయి

Published By: HashtagU Telugu Desk
AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్‎లో ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే !!

AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్‎లో ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే !!

AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గమనాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.3,32,205 కోట్ల భారీ అంచనాతో వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. “ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే మా ప్రథమ ప్రాధాన్యత” అని స్పష్టం చేస్తూ, రాష్ట్రం ప్రస్తుతం 11.75 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, రాబోయే రోజుల్లో ఇది రెండంకెలకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో వృద్ధి రేటు 10.3 శాతానికి పడిపోగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నామని ఆయన తన ప్రసంగంలో నొక్కి చెప్పారు.

ఈ బడ్జెట్ కేవలం అంకెలకు పరిమితం కాకుండా, ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ కి బలమైన పునాది వేసేలా రూపొందించబడింది. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యంగా నిధుల కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ పథకాలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, మరియు రాజధాని అమరావతి నిర్మాణానికి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చడానికి రెండేళ్ల సమయం సరిపోదని, ప్రజల ఆశలను నెరవేర్చేందుకు ఈ బడ్జెట్ ఒక ‘రోడ్ మ్యాప్’ లాంటిదని మంత్రి అభివర్ణించారు. సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

బడ్జెట్ 2026: ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే..

రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు
మూలధన వ్యయం రూ.53,915 కోట్లగా అంచనా
రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు
ద్రవ్య లోటు రూ.75,868 కోట్లగా అంచనా

మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు-రూ.9,906 కోట్లు
అన్నదాత సుఖీభవ-రూ.6,600 కోట్లు
పోలవరం-రూ.6,105కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన-రూ.1,927 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి-రూ.500 కోట్లు
మత్స్యకార సేవలో-రూ.260కోట్లు
పంటల బీమా-రూ.250 కోట్లు
పీఎం కృషి సించాయి యోజన-రూ.190 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమం-రూ.4,581 కోట్లు
ఉపకారవేతనాలు-రూ.3,836 కోట్లు
సమగ్ర శిక్షణ-రూ.2,946 కోట్లు
ఉన్నత విద్య-రూ.2,566 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం-రూ.2,161 కోట్లు
మన బడి, మన భవిష్యత్-రూ.1,500 కోట్లు
నైపుణ్యాభివృద్ధి-రూ.1,232 కోట్లు
పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా-రూ.707 కోట్లు
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర-రూ.654 కోట్లు
యువత, క్రీడలు-రూ.438 కోట్లు

ఎన్టీఆర్ భరోసా-రూ.27,719 కోట్లు

దీపం 2.0 – రూ.2,601 కోట్లు

వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు-రూ.2,320 కోట్లు

స్త్రీశక్తి-రూ.1,420 కోట్లు
వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్-రూ.600 కోట్లు
ఆటో డ్రైవర్ల సేవలో-రూ.450 కోట్లు
తల్లికి వందనం-రూ.9,668 కోట్లు

ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ.3,32,205 కోట్లు.
పాఠశాల విద్య రూ.32,308 కోట్లు.
వైద్య శాఖ రూ.19,306 కోట్లు.
వ్యవసాయ శాఖ రూ.11,745 కోట్లు.
సాంఘిక సంక్షేమం రూ.11,118 కోట్లు.
బీసీ సంక్షేమం రూ.23,650 కోట్లు.
ఇంధన శాఖ రూ.13,934 కోట్లు.
పంచాయతీరాజ్‌ శాఖ రూ.22,941 కోట్లు.
జలవనరులు రూ.18,223 కోట్లు.

పాఠశాల విద్య రూ.32,308 కోట్లు
వైద్య శాఖ రూ.19,306 కోట్లు
వ్యవసాయ శాఖ రూ.11,745 కోట్లు
సాంఘిక సంక్షేమం రూ.11,118 కోట్లు
ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ.3,32,205 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు.
మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా.
రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు.
ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు.

  Last Updated: 14 Feb 2026, 12:22 PM IST