AP Assembly Day 1:: మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సభ ఇలా సాగింది

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు

AP Assembly Day 1: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై చర్చ జరగాలని కోరుతూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించినందుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన కొందరిని సస్పెండ్ చేయడంతో గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దద్దరిల్లింది.

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముగ్గురు సభ్యులని సస్పెండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మరియు వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఒకరిని మిగిలిన సెషన్‌లో సస్పెండ్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసినందుకు ఇతర ప్రతిపక్ష శాసనసభ్యులను రోజంతా సస్పెండ్ చేశారు. హిందూపూర్ ఎమ్మెల్యే , నటుడు బాలకృష్ణ సభలో “మీసాలు తిప్పడం” మరియు “తొడలు కొట్టడం” లాంటి చర్యలకు స్పీకర్‌ సీరియస్ అయ్యాడు. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసి సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

మొత్తం సెషన్‌కు సస్పెండ్ అయిన శాసనసభ్యులలో పి కేశవ్, టిడిపి నుండి ఎ సత్య ప్రసాద్ మరియు వైఎస్‌ఆర్‌సిపికి చెందిన కె శ్రీధర్ రెడ్డి ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో శ్రీధర్ రెడ్డిని కొన్ని నెలల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని తీర్మానం చేసిన శాసనసభా వ్యవహారాల మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి టేబుల్ అద్దాలు పగలగొట్టడం క్రిమినల్ చర్య అని అన్నారు. టీడీపీ సభ్యులు చేస్తున్న డిమాండ్లపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

ఇదిలా ఉండగా ఈ రోజు సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ప్లకార్డులతో పోడియం వద్దకు చేరుకుని స్పీకర్‌ను చుట్టుముట్టారు. సభను కొద్దిసేపు వాయిదా వేసే ముందు స్పీకర్ విపక్ష ఎమ్మెల్యేలు తమ స్థానాల్లోకి వెళ్లి ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని కోరారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Also Read: IndiGo: 2 గంటల్లో నేరుగా హైదరాబాద్ నుంచి కొలంబో ఇండిగో ఫ్లైట్