Drone Summit : ఈనెల 22, 23 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024’ జరగబోతోంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ వేదికగా ఈ సదస్సు జరగబోతోంది. ఇందులో భాగంగా మొదటి రోజు (ఈనెల 22న) డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగంపై(Drone Summit) చర్చించనున్నారు. ఇందుకోసం 9 సెషన్లు ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాంకేతికత వినియోగంపై నాలుగు ప్రజెంటేషన్లు ఇస్తారు. ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లు జరుగుతాయి. ఈ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది ప్రతినిధులు హాజరవుతారు.
Also Read :Agniveer : ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ.. యువతకు ఉద్యోగ అవకాశం
- ఈ సదస్సులో ప్రముఖ డ్రోన్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఇందుకోసం 40 సెంటర్లు ఉంటాయి.
- ఈనెల 22న సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కృష్ణానది ఒడ్డున పున్నమి ఘాట్ వద్ద 5వేల డ్రోన్లతో భారీ డ్రోన్ షో ఏర్పాటు చేశారు. ఇందులో లేజర్ షో, ఫైర్ వర్క్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
- డ్రోన్ వాడకం, తయారీ కేంద్రంగా ఏపీని మార్చడం ద్వారా రాబోయే ఐదేళ్లలో రూ.2వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- యువతను డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్ది.. వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలని ఏపీ సర్కారు భావిస్తోంది.
- డ్రోన్లకు రిపేర్లు చేయడంలోనూ యువతకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ విభాగంలో వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నారు. ఈ అంశాన్ని ఒక సబ్జెక్ట్గా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నారు.
- డ్రోన్ ఇన్నోవేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటాను 25 శాతం మేర పెంచాలని టీడీపీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
- పైన పేర్కొన్న లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీని రూపొందించారు. ‘అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024’ సందర్భంగా డ్రోన్ పాలసీని విడుదల చేసి చర్చించనున్నారు.
Also Read :Dumstick Benefits : మునగ మగవారికే కాదు స్త్రీలకు కూడా ఎంతో మేలు చేస్తుందని తెలుసా..?
- ప్రస్తుతం డ్రోన్ వాడకంపై దాదాపు పాతిక పరిమితులు ఉన్నాయి. వాటిని ఐదుకు పరిమితం చేయాలని ఏపీ సర్కారు యోచిస్తోంది.
- డ్రోన్లను ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన శిక్షలు పడేలా రూల్స్ను అమలు చేయనున్నారు.
- రూల్స్కు వ్యతిరేకంగా డ్రోన్లు వాడితే రూ.లక్ష ఫైన్ వేయాలని భావిస్తున్నారు.
- 300 కిలోల నుంచి 500 కిలోల వరకు బరువున్న డ్రోన్లను వాడేలా చూడాలని యోచిస్తున్నారు.
- డ్రోన్ల రిజిస్ట్రేషన్, లైసెన్సుల కోసం సెక్యూరిటీ క్లియరెన్సుతో సంబంధం లేకుండా అనుమతులు మంజూరు చేయాలని భావిస్తున్నారు.
- గ్రీన్ జోన్లో డ్రోన్లను వాడుకునేందుకు అనుమతులు అవసరం లేదు. రెడ్, ఎల్లో జోన్లలో డ్రోన్లను వాడాలంటే తప్పకుండా అధికారుల అనుమతి పొందాలి.