AP Weather : ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మరోసారి తన అనిశ్చిత స్వభావాన్ని చూపిస్తోంది. ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా, బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా తూర్పు అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఒకవైపు ఎండ తీవ్రత పెరుగుతుండగా, మరోవైపు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉదాహరణకు, ఒంగోలులో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలకు చేరింది. ఎండ ఇబ్బంది పెడుతుంటే, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఊరట కలిగిస్తున్నాయి. అయితే ఈ వర్షాలు కూడా సమానంగా పడకపోవడంతో వాతావరణంలో అనిశ్చితి మరింత పెరిగింది.
Free Current : ఫ్రీ కరెంట్ రానివారికి మరో ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రానున్న 24 గంటల్లో కోస్తా , రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆగస్టు 5 నుంచి రాయలసీమ , దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షపాతం మరింత పెరుగుతుందని అంచనా వేస్తోంది.
విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం, ఉపరితల ఆవర్తనం ప్రభావం రాబోయే మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ కారణంగా పల్నాడు జిల్లా సహా రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం నాటికి అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రం మొత్తం ఉష్ణోగ్రతల పెరుగుదల, వర్షాల తారతమ్యం ఒకేసారి అనుభవిస్తోంది. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిడుగులు, ఉరుముల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Mouth Ulcers : నోట్లో పుండ్లు పుట్టి ఏం తినలేకపోతున్నారా? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్ దొరుకుతుంది