Bengal Tiger: చిక్కదు.. దొరకదు.. బెంబెలెత్తిస్తున్న ‘బెంగాల్ టైగర్’

రాయల్ బెంగాల్ టైగర్ పంజా విసురుతోంది. మేక, ఆవు, బర్రె, గొర్రె ఏదీ కనిపించినా వదలడం లేదు.

Published By: HashtagU Telugu Desk

రాయల్ బెంగాల్ టైగర్ పంజా విసురుతోంది. మేక, ఆవు, బర్రె, గొర్రె ఏదీ కనిపించినా వదలడం లేదు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ చిక్కినట్టే తప్పించుకుంటోంది. రక్తపు రుచి మరిగిని ఈ పులి పశు సంపదపై విరుచుకుపడుతోంది. తాజాగా విశాఖలోని కోటపాడు సమీపంలోని ఆర్ల-చింతలపాలెం మధ్య మరో పశువును చంపేసింది. మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. బెంగాల్ టైగర్ ను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు ఉత్తరప్రదేశ్ నుండి పెద్ద పంజరాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారి వద్ద ఉన్న బోనులు చిన్నవి. ప్రమాదకర జంతువులను ట్రాప్ చేయడానికి వాటిని ఉపయోగిస్తారు.  “కె కోటపాడు ప్రాంతంలో అటవీ ప్రాంతంలో పులి ఉంది. దేవరపల్లె మీదుగా అనత్‌గిరి అడవుల్లోకి ప్రవేశిస్తుందని మేం భావిస్తున్నాం. వేపాడులోని జనవాసాల్లోకి ప్రవేశించినప్పుడు మేము ఆందోళన చెందాం. కానీ అది ఇప్పుడు అడవి వైపు దిశ మార్చుకుంది’’ అని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పి రామమోహనరావు తెలిపారు.

కాగా శనివారం ఒక గ్రామస్థుడు పులిని చూసినట్లు జిల్లా అటవీ అధికారి (డిఎఫ్‌ఓ) అనంత్ శంకర్ తెలిపారు. “పగ్ గుర్తులు గుర్తించబడ్డాయి. ఇది చాలా ప్రాంతాలను కవర్ చేస్తూ వేగంగా కదులుతున్నట్లు కనిపిస్తోంది. సబ్బవరం నుంచి కొత్తవలసలోకి ప్రవేశించిన పులి దిశ మార్చుకుంది. ఇది మొదట్లో ఉత్తరం వైపు వేపాడ వైపు మళ్లింది. ఇప్పుడు కె కోటపాడు వైపు వచ్చింది ”అని ఆ అధికారి చెప్పాడు. ఆర్ల-చింతలపాలెం మధ్య పశువులను చంపే ముందు పులి సూదికొండ, ఉలవకొండ, గొల్లలపాలెం మీదుగా దాలివలస కొండ ప్రాంతానికి చేరుకుని ఉంటుందని, ఆ ప్రాంతంలో నిఘా పెంచేందుకు కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పులి దేవరపల్లె లేదా విజయనగరం వైపు వెళ్లే అవకాశం ఉంది” అని అన్నారు. బెంగాల్ టైగర్ దెబ్బకు ఇప్పటికీ పదుల సంఖ్యలో జీవాలు చనిపోయాయి. ఇది ఎప్పుడు చిక్కుతుందా? అని కాకినాడ, విశాఖ, అనకాపల్లి జిల్లాల ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

  Last Updated: 18 Jul 2022, 05:32 PM IST