Pedakakani Temple Issue : ఏపీ దేవాల‌యాల్లో నాన్ వెజ్‌

ఏపీలో ప్ర‌ముఖ దేవాల‌యం శ్రీ మల్లేశ్వర స్వామి క్యాంటీన్ లో మాంసాహారం త‌యారు చేయ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

  • Written By:
  • Publish Date - April 9, 2022 / 05:24 PM IST

ఏపీలో ప్ర‌ముఖ దేవాల‌యం శ్రీ మల్లేశ్వర స్వామి క్యాంటీన్ లో మాంసాహారం త‌యారు చేయ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. దేవాల‌య క్యాంటిన్ ను దేవాదాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. భక్తుల ఫిర్యాదుల మేరకు జిల్లాలోని పెదకాకాని గ్రామంలో ఆలయక్యాంటీన్ కాంట్రాక్టర్ ద్వారా ఆలయ వంటగదిలో మాంసాహారం వండార‌ని ప్రాథ‌మిక ఆరోప‌ణ‌. ఆ క్ర‌మంలో ఎండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్ క్యాంటీన్‌ను పరిశీలించారు. కాంట్రాక్టర్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేశారు. అతని కాంట్రాక్ట్ ను కూడా రద్దు చేయబడింది. షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. బయట మాంసాహారం తయారు చేశారని కాంట్రాక్టర్ వివరించినట్లు షోకాజ్ నోటీస్ కు తిరుగు స‌మాధానం ఇచ్చార‌ని తెలుస్తోంది. క్యాంటీన్ఆ హార పదార్థాలతో కూడిన ట్రక్ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. దానిలో మాంసాహారం ఉంద‌ని వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది.కాంట్టాక్ట‌ర్ ఇచ్చిన వివ‌ర‌ణ స‌రిగా లేక‌పోవ‌డంతో “క్యాంటీన్‌ను సీజ్ చేశారు. కాంట్రాక్టర్ మరియు అతని సిబ్బందిని తొలగించారు. క్యాంటీన్ కాంట్రాక్టును వేలం విధానం ద్వారా స్థానిక విక్రేతకు ఇచ్చారు. క్యాంటీన్ ఒప్పందం ప్రకారం, వంటగదిలో శాఖాహార ఆహారాన్ని తయారు చేయాలి. నిత్యాన్నదానంలో భాగంగా భక్తులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించారు. భక్తులకు మాంసాహారం వ‌డ్డించ‌డంతో వివాదం మొదలైంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.