Site icon HashtagU Telugu

Ambati Rambabu : గుంటూరు కలెక్టరేట్‌ వద్ద అంబటి రాంబాబు హల్‌చల్‌

Ambati Rambabu hustle and bustle at Guntur Collectorate

Ambati Rambabu hustle and bustle at Guntur Collectorate

Ambati Rambabu : గుంటూరు జిల్లాలో ఈరోజు ఉదయం ఓ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో ఘర్షణకు దిగారు. ‘వెన్నుపోటు దినం’ పేరుతో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అంబటి రాంబాబు నేతృత్వంలోని వైసీపీ నాయకులు గుంటూరు కలెక్టరేట్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వారు యత్నించారు. అయితే కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి ఒక్కసారిగా అనుమతించలేమని పోలీసులు వారిని నిలిపారు. కేవలం ప్రతినిధి బృందానికే లోనికి అనుమతి ఉన్నదని పోలీసులు స్పష్టంచేశారు. దీనితో అంబటి రాంబాబు ఆగ్రహానికి గురయ్యారు.

పోలీసులతో జరిగిన వాగ్వాదంలో అంబటి రాంబాబు చురకులు అంటించారు. “లోపలికి వెళ్తే ఏం చేస్తావ్?” అంటూ అక్కడ విధులు నిర్వహిస్తున్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)తో కిరాతకంగా ప్రవర్తించారు. అయితే సీఐ కూడా మర్యాదగా కానీ గట్టిగా స్పందిస్తూ, “ఇది ప్రభుత్వ కార్యాలయం, నిబంధనలు పాటించాలి. ఎవరు అయినా సరే, పరిమితులలో ఉండాలి” అని తేల్చిచెప్పారు. ఈ ఘటన కొంతసేపు ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల వైఖరిపై ఆగ్రహంతో అంబటి రాంబాబు గట్టిగా స్పందించారు. ఆయన నాయకత్వంలోని కొందరు నేతలు నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అదనపు పోలీసులను మోహరించారు.

అంబటి రాంబాబు మాట్లాడుతూ.. “ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల స్వేచ్ఛను హరించడం తీవ్రంగా ఖండించదగ్గ విషయం. మేము శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుతో కలెక్టరేట్‌కు వచ్చాం. కానీ పోలీసులు అనవసరంగా అడ్డుకున్నారు” అని ఆరోపించారు. వైసీపీ పార్టీ దేశవ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ నిర్వహిస్తున్న నేపథ్యంలో గుంటూరులోని ఈ ఘటన మరింత రాజకీయ వేడి పెంచింది. అధికారంలో నుంచి వైసీపీ పార్టీ బయటపడిన తర్వాత రాజకీయంగా పుంజుకోవడానికి తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యలో ఈ నిరసన కార్యక్రమానికి ప్రాధాన్యత ఉంది. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు కూడా పోలీసులపై కఠినంగా వ్యవహరించిన అంబటి రాంబాబు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నా తానే తానే అని స్పష్టం చేశారు.