Site icon HashtagU Telugu

Roja : ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే కూటమికి గెలుపు : రోజా ఆరోపణలు

Alliance wins due to EVM tampering: Roja alleges

Alliance wins due to EVM tampering: Roja alleges

Roja: అనకాపల్లిలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రముఖ నాయకురాలు ఆర్.కె. రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈవీఎంల తేడాల వల్లనే అధికారాన్ని దక్కించుకుందని ఆమె ఆరోపించారు. కూటమి నిజాయితీగా ప్రజల మెప్పుతో గెలిచిందనుకోవడం భ్రమ అని, ప్రజల తీర్పును వక్రీకరించేందుకు మకుటమైన కుట్ర జరిగింది అని మండిపడ్డారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేసి కూటమి గెలిచింది.

ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద లోపం. కానీ ఇది చరిత్రగా మిగిలిపోదు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు మనవైపే ఉంటుంది అని ధీమాగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు ప్రజల కోసం పని చేయడం మరిచిపోయి మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. అసత్య ఆరోపణలతో కేసులు బనాయించి, వేధింపులకు గురిచేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని మండిపడ్డారు.

జగన్ పాలన ప్రజల హృదయాల్లో

వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోందని రోజా వివరించారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజల జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.అమ్మ ఒడి, విద్యా దీవెన, రైతు భరోసా వంటి పథకాలు అనేక మందికి లబ్ధి చేకూర్చాయి. ఇవి కూటమి ప్రభుత్వం ఇవ్వలేని సేవలు అని తెలిపారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని నిలిపివేసి, సంక్షేమ పథకాలను వెనక్కి తగ్గించిందని ఆరోపించారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా, రాజకీయ కక్షలతో పనులు చేస్తున్నారని ఆమె విమర్శించారు.

‘జగన్ 2.0’కి సిద్ధంగా ఉండండి..రోజా హెచ్చరిక

వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనేది అనివార్యం. ప్రజలు మమ్మల్ని మళ్లీ నమ్ముతారు. అప్పుడే ‘జగన్ 2.0’ పరిపాలన ఎలా ఉంటుందో ఈ కూటమి నాయకులకు తెలుస్తుంది. ప్రజల కోసం పని చేయని వారికి ప్రజలే తగిన శిక్ష విధిస్తారు. ఇప్పుడు అక్రమ కేసులు వేస్తున్నవారు రేపటి రోజున చట్టానికి ఎదురుగా నిలబడక తప్పదు అని రోజా స్పష్టం చేశారు. ఆమె మాటల్లో ధ్వనించిన ఆత్మవిశ్వాసం పార్టీ కార్యకర్తలకు ఉత్తేజాన్నిచ్చిందని సభలో పాల్గొన్న వైసీపీ నాయకులు తెలిపారు. ప్రజల మద్దతు తమ పార్టీతో ఉందన్న నమ్మకంతో, వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదే అని రోజా విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also: TVK : బీజేపీతో ఎప్పటికీ పొత్తు ఉండదు.. వేదికపై కన్నీరు పెట్టుకున్న విజయ్