T20 In Vizag: అన్ని దారులు.. వైజాగ్ వైపే!

మంగళవారం భారత్-దక్షిణాఫ్రికా T20 క్రికెట్ మ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ లో జరుగబోతున్న విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Vizag

Vizag

మంగళవారం భారత్-దక్షిణాఫ్రికా T20 క్రికెట్ మ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ లో జరుగబోతున్న విషయం తెలిసిందే. వైజాగ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో PM పాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఎటుచూసినా భారత జెండాలు, బ్యానర్లే కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సీఎఫ్‌వో జగన్నాధరరావు మాట్లాడుతూ మ్యాచ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్ 19 కారణంగా రెండున్నరేళ్ల విరామం తర్వాత స్టేడియం మ్యాచ్‌ను నిర్వహిస్తోంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

‘ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కాబట్టి ఇక్కడ జరిగే మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాల్సి ఉంటుంది. వైజాగ్ స్టేడియం అంటే మ్యాచ్‌లు గెలవాలనే సెంటిమెంట్. ఏప్రిల్ 2005లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో MS ధోని 148 పరుగులు చేశాడు” అని రావు DCకి చెప్పాడు. భద్రత కోసం 1500 మంది పోలీసులను నియమించనున్నట్లు వైజాగ్ నగర కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. “ట్రాఫిక్ డైవర్షన్స్ మధ్యాహ్నం నుంచి అమలులోకి వస్తాయి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి ప్రజలు ప్రైవేట్ వాహనాలకు బదులుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులను ఉపయోగించాలి ”అని ఆయన అన్నారు.

వివిధ మార్గాల నుంచి స్టేడియానికి సిటీ బస్సులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30 వరకు తిరుగుతాయి. తిరుగు ప్రయాణంలో రాత్రి 10 గంటలకు బస్సులు ప్రారంభమవుతాయని ఏపీ పోలీసులు తెలిపారు. “జూన్ 14న జరగనున్న T20 మ్యాచ్ కోసం 100 సిటీ బస్సులు నడుపబడతాయి. అవసరమైతే మరిన్ని బస్సులను కలుపుతాము” అని పోలీసులు తెలిపారు. క్రికెట్ అభిమానులు శానిటైజేషన్, మాస్క్‌లు ధరించడం వంటి కోవిడ్-19 ప్రోటోకాల్‌లను పాటించాలని విమ్స్ డైరెక్టర్ రాంబాబు సూచించారు.

  Last Updated: 14 Jun 2022, 12:10 PM IST