Tirupati Trains Alert : తిరుపతికి వెళ్లే వారికి అలర్ట్.. ఆ రైళ్లు దారి మళ్లింపు.. కొత్తరూట్ ఇదీ

Tirupati Trains Alert : ఏటా సమ్మర్ టైంలో తిరుపతికి భక్తులు పెద్దసంఖ్యలో వెళ్తుంటారు.

  • Written By:
  • Publish Date - April 28, 2024 / 04:03 PM IST

Tirupati Trains Alert : ఏటా సమ్మర్ టైంలో తిరుపతికి భక్తులు పెద్దసంఖ్యలో వెళ్తుంటారు. అందుకే ఆ రూట్‌లో ప్రయాణించే రైళ్లన్నీ బాగా కిక్కిరిసి ఉంటాయి.  వేసవి సెలవుల వేళ తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లొద్దామని భావించే వారికి ఒక అలర్ట్.  సికింద్రాబాద్ డివిజన్​లో ట్రాఫిక్ మెయింటనెన్స్ వర్క్స్​ కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రూట్‌లో నడిచే మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది.ఇలా రద్దు చేసిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలను(Tirupati Trains Alert) ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

  • ఆదిలాబాద్ – తిరుపతి(ట్రైన్ నంబర్ 17406), తిరుపతి – ఆదిలాబాద్(ట్రైన్ నెంబర్ 17405) మధ్య నడిచే రైళ్లను దారి మళ్లించారు. ఇవి ప్రస్తుతం గూడూరు, విజయవాడ, కాజీపేట మీదుగా ప్రయాణిస్తాయి.
  • తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు అందుబాటులో ఉండే ట్రైన్​(17405)ను ఏప్రిల్ 29, 2024 నుంచి మే 10 వరకు, మే 16 నుంచి మే 22 వరకు దారి మళ్లిస్తారు.
  • ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు అందుబాటులో ఉండే ట్రైన్(17406)ను ఏప్రిల్ 28, 2024 నుంచి మే 9 వరకు, మే 15 నుంచి మే 21 వరకు రోజూ ప్రయాణించే మార్గంలో కాకుండా కొత్త రూట్​లో పంపుతారు.

Also Read :PM Modi : స్వాతంత్య్రం వచ్చిన మర్నాడే రామమందిరం కట్టి ఉండాల్సింది : ప్రధాని మోడీ

  • దారి మళ్లించిన రైళ్లు పైన పేర్కొన్న తేదీలలో పెదవడ్లపూడి, దుగ్గిరాల, విజయవాడ, కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, ఖమ్మం, డోర్నకల్, గార్ల, మహబూబాబాద్, కేసముద్రం, నెకొండ, వరంగల్, కాజీపేట్, ఘన్‌పూర్, రఘునాథ్‌పల్లి, జనగాం, ఆలేర్, యాదాద్రి, భువనగిరి మీదుగా ప్రయాణిస్తాయి.
  • సికింద్రాబాద్ డివిజన్​లో ట్రాఫిక్ మెయింటనెన్స్ వర్క్స్​ కారణంగా భద్రాచలం రోడ్ నుంచి విజయవాడ వరకు ప్రయాణించే ట్రైన్​ను(07278)ను ఏప్రిల్ 22 నుంచి మే 26 వరకు రద్దు చేశారు.
  • విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వరకు నడిచే ట్రైన్(07979)ను ఈ నెల 22 నుంచి మే 26 వరకు రద్దు చేశారు.
  • ఏప్రిల్ 29 నుంచి మే 22 వరకు డోర్నకల్ నుంచి విజయవాడ వరకు నడిచే రైలు(07755)ను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది.
  • విజయవాడ నుంచి డోర్నకల్ వరకు నడిచే ట్రైన్​ను(07756) ఈ నెల 29 నుంచి మే 22 వరకు రద్దు చేశారు.

Also Read :Elon Musk Vs Aliens : 6,000 శాటిలైట్లు.. ఏలియన్స్‌ సంచారం.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు