Tirupati Trains Alert : ఏటా సమ్మర్ టైంలో తిరుపతికి భక్తులు పెద్దసంఖ్యలో వెళ్తుంటారు. అందుకే ఆ రూట్లో ప్రయాణించే రైళ్లన్నీ బాగా కిక్కిరిసి ఉంటాయి. వేసవి సెలవుల వేళ తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లొద్దామని భావించే వారికి ఒక అలర్ట్. సికింద్రాబాద్ డివిజన్లో ట్రాఫిక్ మెయింటనెన్స్ వర్క్స్ కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రూట్లో నడిచే మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది.ఇలా రద్దు చేసిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలను(Tirupati Trains Alert) ఇప్పుడు తెలుసుకుందాం.
We’re now on WhatsApp. Click to Join
- ఆదిలాబాద్ – తిరుపతి(ట్రైన్ నంబర్ 17406), తిరుపతి – ఆదిలాబాద్(ట్రైన్ నెంబర్ 17405) మధ్య నడిచే రైళ్లను దారి మళ్లించారు. ఇవి ప్రస్తుతం గూడూరు, విజయవాడ, కాజీపేట మీదుగా ప్రయాణిస్తాయి.
- తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు అందుబాటులో ఉండే ట్రైన్(17405)ను ఏప్రిల్ 29, 2024 నుంచి మే 10 వరకు, మే 16 నుంచి మే 22 వరకు దారి మళ్లిస్తారు.
- ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు అందుబాటులో ఉండే ట్రైన్(17406)ను ఏప్రిల్ 28, 2024 నుంచి మే 9 వరకు, మే 15 నుంచి మే 21 వరకు రోజూ ప్రయాణించే మార్గంలో కాకుండా కొత్త రూట్లో పంపుతారు.
- దారి మళ్లించిన రైళ్లు పైన పేర్కొన్న తేదీలలో పెదవడ్లపూడి, దుగ్గిరాల, విజయవాడ, కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, ఖమ్మం, డోర్నకల్, గార్ల, మహబూబాబాద్, కేసముద్రం, నెకొండ, వరంగల్, కాజీపేట్, ఘన్పూర్, రఘునాథ్పల్లి, జనగాం, ఆలేర్, యాదాద్రి, భువనగిరి మీదుగా ప్రయాణిస్తాయి.
- సికింద్రాబాద్ డివిజన్లో ట్రాఫిక్ మెయింటనెన్స్ వర్క్స్ కారణంగా భద్రాచలం రోడ్ నుంచి విజయవాడ వరకు ప్రయాణించే ట్రైన్ను(07278)ను ఏప్రిల్ 22 నుంచి మే 26 వరకు రద్దు చేశారు.
- విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వరకు నడిచే ట్రైన్(07979)ను ఈ నెల 22 నుంచి మే 26 వరకు రద్దు చేశారు.
- ఏప్రిల్ 29 నుంచి మే 22 వరకు డోర్నకల్ నుంచి విజయవాడ వరకు నడిచే రైలు(07755)ను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది.
- విజయవాడ నుంచి డోర్నకల్ వరకు నడిచే ట్రైన్ను(07756) ఈ నెల 29 నుంచి మే 22 వరకు రద్దు చేశారు.