Whats Today : ఇవాళ మధ్యాహ్నం రాజమండ్రిలోని హోటల్ మంజీరాలో టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ తొలి భేటీ జరగనుంది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై ఈసందర్భంగా చర్చించనున్నారు.
- జగనాసుర దహనం పేరిట ఇవాళ నిరసనలు నిర్వహించాలని నారా లోకేష్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
- నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. బాబుతో నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణి ములాఖత్ అవుతారు.
- హమూన్ తుఫాను ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించనుంది.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ శ్రీశైలంలో 9వ రోజు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి దర్శనమివ్వనున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి గుమ్మనూర్ జయరామ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.
- దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్దనిగా.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. అనంతరం కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా(Whats Today) నిర్వహించనున్నారు.