Amarnath Yatra : 84 మంది ఏపీ యాత్రికులు సేఫ్‌.. ఇద‌రు మిస్సింగ్‌..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సుమారు 84 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు

Published By: HashtagU Telugu Desk
Amarnath

Amarnath

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సుమారు 84 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

మ‌రో ఇద్ద‌రు మహిళలు స‌మాచారం మాత్రం తెలియ‌డం లేద‌ని తెలిపారు. తొలుత ఐదుగురు యాత్రికులు గల్లంతయ్యారని, ఆ తర్వాత ముగ్గురిని గుర్తించి వారు క్షేమంగా ఉన్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చాలా మంది యాత్రికులతో, వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు .

ప్రభుత్వ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం రాజమహేంద్రవరం నుండి అమర్‌నాథ్‌కు వెళ్లిన 20 మంది సభ్యుల బృందంలో, కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే జాడ తెలియలేదు. స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదివారం రాజమహేంద్రవరంలో ఇద్దరు మహిళల బంధువులను పరామర్శించి పరిస్థితిని చర్చించారు.

గుంటూరుకు చెందిన 38 మంది బృందం, తాడేపల్లిగూడెంలో 17 మంది సభ్యుల బృందం, తిరుపతికి చెందిన ఆరుగురు సభ్యుల బృందం, విజయనగరం నుండి వచ్చిన మరో యాత్రికుడు కూడా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.క‌డ‌ప జిల్లాలోని రాజంపేటకు చెందిన కొంతమంది యాత్రికులు కూడా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం AP భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్‌ను శ్రీనగర్‌కు పంపారు. రాష్ట్రంలోని యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి AP ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 1902ను ప్రారంభించింది.

  Last Updated: 10 Jul 2022, 05:54 PM IST