Kuwait Fire: జూన్ 12న కువైట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయులలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు. వారిని మీసాల ఈశ్వరుడు, మొల్లేటి సత్యనారాయణ, తామాడ లోకంధంలుగా గుర్తించారు.
ఈశ్వరుడు, సత్యనారాణ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు కాగా, లోకంధం శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు.కువైట్ నుంచి వచ్చిన తర్వాత భౌతికకాయాన్ని వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ తెలిపింది. కువైట్లోని అహ్మదీ గవర్నరేట్లోని మంగాఫ్లోని ఏడు అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించారు మరియు 33 మంది గాయపడ్డారు.
195 మంది వలస కార్మికులు నిద్రిస్తున్న సమయంలో ఉదయం 4 గంటలకు వంటగదిలో మంటలు ప్రారంభమయ్యాయి. విషాదం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నివాసి లోకంధం అదే రాత్రి కువైట్లో దిగి అపార్ట్మెంట్కు చేరుకున్నట్లు సమాచారం. అతను మరుసటి రోజు పనిలో చేరాల్సి ఉంది. లోకంధం కుటుంబ సభ్యులు గురువారం అతనిని సంప్రదించడానికి ప్రయత్నించగా అతని మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. దీంతో అతన్ని రిక్రూట్ చేసిన కంపెనీని సంప్రదించారు. ప్రమాదంలో మరణించాడని తెలుసుకుని ఆ కుటుంబం కన్నీరుమున్నీరు అయింది.
Also Read: Paytm Employees: ఉద్యోగులను తొలగిస్తున్న పేటీఎం.. బలవంతంగా రాజీనామాలు..!