హింసాత్మక మణిపూర్లో (Manipur) చిక్కుకుపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు సోమవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం 214 మంది తెలుగు విద్యార్థులతో (Telugu Students) ప్రత్యేక విమానం మధ్యాహ్నం 1.22 గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Airport) దిగింది. 106 మంది విద్యార్థులు తెలంగాణకు చెందిన వారు కాగా, మిగిలిన 108 మంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) అధికారులతో కలిసి విమానాశ్రయంలో విద్యార్థులకు స్వాగతం పలికారు. విద్యార్థులు తమ ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా అధికారులు భోజన, రవాణా ఏర్పాట్లు చేశారు.
పరిస్థితి దారుణంగా ఉందని, కాలేజీ చుట్టుపక్కల ఇళ్లు పేలడంతో భయంతో జీవించామని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత ఎంతో సాయం చేశారని విద్యార్థులు అన్నారు. మణిపూర్లో తెలంగాణకు చెందిన 180 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మిగిలిన విద్యార్థులు కోల్కతా చేరుకోగా, సోమవారం రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మణిపూర్లోని అధికారులను సంప్రదించారు. విద్యార్థులను తీసుకొచ్చేందుకు, వారి ప్రయాణ ఖర్చులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్, ప్రొటోకాల్ విభాగం కార్యదర్శి అరవింద్ సింగ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్, ఇతర అధికారులు విద్యార్థులకు స్వాగతం పలికారు. ఇళ్లకు చేరుకునేందుకు బస్సులు కూడా ఏర్పాటు చేశారు.
Also Read: Panchayat Secretaries: పంచాయతీ కార్యదర్శులకు వార్నింగ్, విధుల్లో చేరాలని ఆదేశం