వరుస చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ ( Keerthy Suresh ). ఈ భామకి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా చాలు.. జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తుంటుంది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే కీర్తి సురేష్, ప్రస్తుతం థాయ్ లాండ్ లో విహరిస్తోంది. అక్కడ ఓ ఈత కొలనులో ఆమె జలకాలాడుతున్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతూ.. లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఈత కొలనులో ఉన్న ఫొటోలతో పాటు.. బీచ్ ఒడ్డున ఉన్న సన్ రైజ్ ను ఆస్వాదిస్తున్న ఫొటోలను కూడా ఆమె యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తెలుగులో చిరుకి చెల్లెలిగా ‘భోళాశంకర్’ లో చేస్తుండగా.. నాని సరసన ‘దసరా’ సినిమా చేస్తోంది.
Also Read: Double Decker E-Buses : హైదరాబాద్ కు మళ్ళీ డెక్కర్ ఈ – బస్సులు!