రెండ్రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకోవడం అందరికీ తెలిసిందే. చంద్రబాబు కోనసీమ జిల్లా పర్యటనలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజోలు మండలం సోంపల్లి రేవులో లాంచీ దిగుతుండగా…అందరూ ఆకస్మాత్తుగా నీటిలో పడిపోయారు. ప్రమాద సమయంలో లాంచీలో చంద్రబాబుతోపాటు 15మంది ఉన్నారు. ఈ ప్రమాదం వెనక విజయసాయిరెడ్డి ఉన్నారన్నది టీడీపీ వాదన. ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ అదే తేలుతుందని టీడీపీ వాదించగా…అసలు విజయసాయిరెడ్డి ఏమని ట్వీట్ చేశారో చూద్దాం.
వెన్నుపోట్లతో అడ్డదారిలో రాజకీయ శిఖరాగ్రానికి చేరి ఇప్పుడు బాధితుడిగా మారి అక్కడి నుంచి జారి పడడమే జరగబోయే పరిణామం. కాలం మీ పాపాలను మరుగుపరిచినా…కర్మ వదలదు…అది వెంటాడుతూనే ఉంటుంది చంద్రబాబు!
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 21, 2022
వెన్నుపోటులో అడ్డదారిలో రాజకీయ శిఖరాగ్రానికి చేరుకున్న చంద్రబాబు…ఇప్పుడు బాధితుడిగా మారి అక్కడి నుంచి జారి పడటమే జరగబోయే పరిణామం. కాలం మీ పాపాలన్నింటిని మరుగుపరిచినా….కర్మ వదలదు. అది ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. అంటూ వివాదస్పద ట్వీట్ చేశారు. ఎవరైనా నీళ్లలో కొట్టుకుపోతుంటే…వారిని కాపాడి ఒడ్డుకు చేర్చాల్సిన మీరే…నీటిలో జారి పడితే ఎలా …ఇదంత పబ్లిసిటీ కోసం చేసిన డేంజరస్ ఫీట్. ఎల్లో మీడియా లైవ్ కవరేజీ కోసమే కదా…అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు టీడీపీ తమ వాదనను వినిపిస్తోంది.