MP Santosh: పిల్లలమర్రికి ప్రాణం పోస్తా!

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు.

  • Written By:
  • Updated On - September 12, 2022 / 08:28 PM IST

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కొన్ని లక్షల మొక్కలను నాటారు. ఈ ఛాలెంజ్ ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేస్తున్నారాయన. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సుమారు 800ఏళ్ల వయసు గల పిల్లల మర్రిని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ సందర్శించారు. చెట్టు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఇక్కడ పర్యాటక అభివృద్ధికి తన ఎంపీ ఫండ్స్‌ విడుదల చేస్తున్నట్లు సంతోష్‌కుమార్‌ తెలిపారు. ఇటీవల వరంగల్ వెయ్యి స్తంభాల గుడిని సందర్శించి, డెవలప్ మెంట్ కోసం కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.