IPL 2022 Finals : ఫైనల్‌ చేరే జట్లు అవే : పార్ధీవ్ పటేల్

ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశా మ్యాచులు మే 22 వరకూ జరగనుండగా అప్పటికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌లోకి అడుగుపెట్టనున్నాయి ఈసారి ఐపీఎల్ లో ఇప్పటి వరకు 39 మ్యాచ్‌లు ముగియగా.. అన్ని జట్లూ సగం మ్యాచ్‌లు ఆడేశాయి

  • Written By:
  • Updated On - April 28, 2022 / 09:10 AM IST

ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశా మ్యాచులు మే 22 వరకూ జరగనుండగా అప్పటికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌లోకి అడుగుపెట్టనున్నాయి ఈసారి ఐపీఎల్ లో ఇప్పటి వరకు 39 మ్యాచ్‌లు ముగియగా.. అన్ని జట్లూ సగం మ్యాచ్‌లు ఆడేశాయి.అయితే ఐపీఎల్ 15వ సీజన్ మెగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడతాయని టీమిండియా మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ జోస్యం చెప్పాడు.తాజాగా ఓ క్రీడా కార్యక్రమంలో పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్లో గుజ‌రాత్ టైటాన్స్‌, ఆర్సీబీ జ‌ట్లు పోటీపడతాయని పేర్కొన్నాడు.. ఐపీఎల్ లోకి కొత్తగా అడుగుపెట్టిన గుజ‌రాత్ టైటాన్స్ జట్టు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. ఈ సీజ‌న్‌ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్రస్థానంలో కోసం పోటీ పడితున్న ఆ జట్టు కచ్చితంగా ఫైనల్లోకి అడుగుపెడుతుందన్నాడు. అలాగే ఈ సీజ‌న్‌లో ఆర్సీబీ కూడా ఫైనల్ కు చేరుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఇటీవల సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ తో పాటు తాజాగా రాజస్థాన్ చేతిలో దారుణంగా ఓడినప్పటికీ తిరిగి బెంగళూరు జట్టు పుంజుకుంటుందని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2022 పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉండగా… గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఐదో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కొనసాగుతున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు వరుసగా 6, 7, 8 స్థానాల్లో నిలిచాయి.