Trinadha Rao Nakkina : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంట విషాదం..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. వరుస విజయాలను అందుకుంటున్న త్రినాథ రావు నక్కిన..

  • Written By:
  • Updated On - April 30, 2024 / 04:02 PM IST

Trinadha Rao Nakkina : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకుడిగా, నిర్మాతగా ఫుల్ జోష్ లో ఉన్న ఈ దర్శకుడు.. నేడు తన తండ్రిని కోల్పోయి తీవ్ర బాధకు లోనయ్యారు. వృద్దాప్యంతో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న త్రినాధరావు తండ్రి నక్కిన సూర్యారావు.. నిన్న (ఏప్రిల్ 30) రాత్రి తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో త్రినాధరావు కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు.. త్రినాధరావు కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

కాగా త్రినాథ రావు ‘ప్రియతమా నీవచట కుశలమా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తరువాత మేం వయసుకు వచ్చాము, సినిమా చూపిస్తా మామా, నేను లోకల్ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసారు. 2022లో రవితేజతో ‘ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించి వంద కోట్ల దర్శకుడు అనిపించుకున్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ తో ఓ సినిమాని చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని లాంచ్ చేసి శరవేగంగా చిత్రకరణ జరుపుతున్నారు.

Also read : Allu Arjun Pushpa 2 : ఆ భాషలో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా పుష్ప 2.. నెవర్ బిఫోర్ రికార్డు..!