Warangal MGM: ఎలుకల దాడిలో గాయపడ్డ రోగి మృతి!

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల దాడి బాధితుడు శ్రీనివాస్

  • Written By:
  • Updated On - April 2, 2022 / 03:16 PM IST

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల దాడి బాధితుడు శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. అంతకుముందు విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘటనాస్థలికి చేరుకున్న  ఆసుపత్రి పారిశుధ్య పనులను పరిశీలించి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్‌ను హైదరాబాద్‌కు తరలించారు. కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్‌ను మార్చి 26న వరంగల్‌ ఎంజీఎంహెచ్‌లో చేర్పించారు. ఎలుకలు గాయపర్చడంతో మెరుగైన వైద్యం కోసం ఏప్రిల్ 1న శ్రీనివాస్‌ను హైదరాబాద్‌కు తరలించారు. కాలేయ సంబంధిత సమస్యలతో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై పలు ప్రజా  సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.