Veera Simha Reddy: ఓటీటీకి వీరసింహారెడ్డి? స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..!

సంకాంత్రి (Sankanthri) కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

బాలకృష్ణ హీరోగా గోపిచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). బాలయ్యకు జోడీగా శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే థియేటర్లో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి .. వీరసింహారెడ్డి ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ నెట్టింట హల్‌చల్‌.

త్వరలోనే ఈమూవీ ఓటీటీకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను డిస్నిప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం డిస్నిప్లస్‌ హాట్‌స్టార్‌ మేకర్స్‌తో భారీ ధరకు డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీరసింహారెడ్డి (Veera Simha Reddy) ఓటీటీ హక్కుల కోసం హాట్ స్టార్ భారీగానే డబ్బులు చెల్లించినట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21 నుంచి ఓటీటీలో అందుబాటులోకి తెచ్చేందుకు హాట్‌స్టార్‌ ప్లాన్‌ చేస్తోందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది.

Also Read:  Varun Tej: వరుణ్‌ తేజ్‌ పెళ్లి పై నాగబాబు క్లారిటీ!