Manchu Vishnu: ఆ యూట్యూబ్ ఛానల్స్ పై కేసు పెడుతున్నా: హీరో మంచు విష్ణు

టాలీవుడ్ హీరో మంచి విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా. ఈ సినిమాలో సన్నీలియోన్ ,పాయల్ రాజ్‌పుత్‌ లు

  • Written By:
  • Updated On - September 29, 2022 / 05:39 PM IST

టాలీవుడ్ హీరో మంచి విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా. ఈ సినిమాలో సన్నీలియోన్ ,పాయల్ రాజ్‌పుత్‌ లు హీరోయిన్ లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. కాగా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయిన విషయం తెలిసిందే.

ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను అక్టోబర్ 5న విడుదల చేయాలి అనుకున్న చిత్ర బృందం ఆ తర్వాత విడుదల తేదీని మార్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే చిత్ర బృందం ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. నేపథ్యంలోనే తాజాగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జిన్నా సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ అక్టోబర్ 21వ తేదీన జిన్నా సినిమాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే అక్టోబర్ 5 న ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మంచి విష్ణు.

అనంతరం సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించాడు. సినిమా ఇండస్ట్రీలో అందరం ఒక కుటుంబంలా ఉండేవాళ్ళము మీడియా పెరగడం కొత్త వాళ్ళు రావడంతో సైడ్ ట్రాక్ పట్టింది అని అన్నాడు మంచు విష్ణు. ఒక హీరో ఆఫీస్ నుంచి తనపై రూల్స్ జరుగుతున్నాయని, తన కుటుంబం మీద కూడా ట్రోలింగ్స్ చేయడానికి ఏకంగా 21 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అని తెలిపాడు మంచు విష్ణు. తనని తన కుటుంబాన్ని ట్రోల్‌ చేస్తున్న 18 యూట్యూబ్‌ చానళ్లపై కూడా కేసులు పెడుతున్నా అని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. ఈ ట్రోల్స్‌ని సాధారణంగా మేం పట్టించుకోము.. కానీ జవాబు దారితనం కోసం కేసులు పెడుతున్నా అని తెలిపారు విష్ణు.