వినోదానికి కేరాఫ్..సచివాలయాలు

  • Written By:
  • Publish Date - September 15, 2021 / 03:35 PM IST

చిత్తూరు జిల్లా క‌ట్టుమంచి గ్రామ స‌చివాల‌యంలో  సిబ్బంది చేసిన  నృత్య వీడియో వైర‌ల్ అయింది.  వివిధ వర్గాల నుంచి సోషల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  లబ్ధిదారుల ఇంటి వద్దకు 500 కంటే ఎక్కువ రకాల సేవలను అందించడం ద్వారా ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా పనిచేసే సంస్థలుగా గ్రామ సచివాలయాలు ఉండాలి. వీటి ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు పునరుద్ఘాటించారు, వినోదాత్మ‌క‌ చర్యల ద్వారా ఇటీవల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాలలో కొంతమంది గ్రామ వాలంటీర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారారు. వైర‌ల్ అయిన వీడియోలో డాన్స్ చేస్తోన్న వాలంటీర్ల‌ను  మోనిక మరియు జగదీష్‌గా గుర్తించారు. కట్టమంచి గ్రామ సచివాలయ పని వేళ‌ల్లో సినిమా పాటలకు నృత్యం చేయడం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ఆ వీడియోపై చిత్తూరు జిల్లా పరిపాలన అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు.