ITR-4 : ఆఫ్లైన్ పద్ధతిలో 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ చేసేందుకు పన్ను చెల్లింపుదారులు ఫారమ్ను నింపి, డిపార్ట్మెంట్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి.ఈ ఏడాది ఫిబ్రవరిలో CBDT సెక్షన్ 139 (1) కింద బహిర్గతం చేయడానికి సంబంధించి ITR-1 ఫారమ్లో ఐటీ శాఖ కొన్ని మార్పులు చేసింది. ఇది వార్షిక పన్ను విధించదగిన ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా దాఖలు చేస్తారు. ఈ కేటగిరిలోని వ్యక్తులు ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.కోటి దాటినా వారి ITR ఫారమ్లలో తెలియజేయాల్సిన అవసరం లేదని సవరించిన నిబంధనల్లో పేర్కొన్నారు. ITR-1, ITR-4 అనేవి పెద్ద సంఖ్యలో చిన్న, మధ్యస్థ పన్ను చెల్లింపుదారులకు అందించే సరళమైన రూపాలు. రూ.50 లక్షల వరకు ఆదాయమున్న వ్యక్తి తన జీతం, ఆస్తి, ఇతర వనరుల (వడ్డీ మొదలైనవి) నుంచి లభించే ఆదాయం వివరాలతో ITR-1ని ఫైల్ చేయవచ్చు.
ఇక ITR-4ను వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, వ్యాపారం మరియు వృత్తి ద్వారా మొత్తం వార్షిక ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్నవారు లేదా సంస్థలు దాఖలు చేయవచ్చు. ITR-2ని రెసిడెన్షియల్ ప్రాపర్టీ ద్వారా ఆదాయం, రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు దాఖలు చేస్తారు. ITR-3ని నిపుణులు దాఖలు చేస్తారు . ITR-5, ITR-6లను LLPలు, వ్యాపార సంస్థలు దాఖలు చేస్తాయి. ఆదాయపు పన్ను శాఖ ఇంకా ఆన్లైన్ ITR ఫారమ్లను విడుదల చేయనప్పటికీ.. 2023-24 లేదా 2022-23 ఆర్థిక సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఆఫ్లైన్ ITR-1, ITR-4 ఫారమ్లను విడుదల చేసింది.
ఫిబ్రవరిలో CBDT నోటిఫై చేసిన తర్వాత ఆఫ్లైన్ ITR-1, ITR-4 ఫారమ్లు అందుబాటులోకి వస్తాయి. ఆఫ్లైన్ పద్ధతిలో పన్ను చెల్లింపుదారులు సంబంధిత ఫారమ్ను డౌన్లోడ్ చేసి నింపి, ఆపై డిపార్ట్మెంట్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఆన్లైన్ ఫారమ్లో పన్ను చెల్లింపుదారులు నేరుగా ఆదాయపు పన్ను పోర్టల్లో తమ ఆదాయానికి సంబంధించిన వివరాలను పూరించి సమర్పించవచ్చు. రెండు మోడ్లలోనూ ఫారమ్లను పన్ను చెల్లింపుదారులు ధృవీకరించాల్సి ఉంటుంది.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ట్యాక్స్పేయర్స్కి సైబర్ నేరగాళ్లు ఎస్ఎంఎస్ లేదా మెయిల్ పంపిస్తున్నారు. మీ ఐటీ రిటర్న్స్ ప్రాసెస్ పెండింగ్లో ఉందని, మీ బ్యాంక్ అకౌంట్లో పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ వివరాలు అప్డేట్ చేయలేదని, వాటిని త్వరగా అప్డేట్ చేయాలని కోరుతారు. అందులో ఉన్న లింక్ క్లిక్ చేసి అప్డేట్ ప్రాసెస్ పూర్తి చేయాలని నమ్మిస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే ఏపీకే ఫైల్ స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. అది బ్యాంక్ యాప్ లాగానే ఉంటుంది. ఆ యాప్ ఓపెన్ చేసి వివరాలన్నీ ఎంటర్ చేస్తే అంతే సంగతులు.బ్యాంకులు ఇలా ఎస్ఎంఎస్, మెసేజింగ్ యాప్స్, సోషల్ మీడియా ద్వారా ఖాతాదారులను సంప్రదించవు. మీరు ఏవైనా వివరాలు అప్డేట్ చేయాలంటే నేరుగా బ్యాంకుకు వెళ్లాలి. లేదా బ్యాంక్ అధికారిక యాప్ ఓపెన్ చేసి అందులో వివరాలు అప్డేట్ చేయాలి. అనుమానాస్పద లింక్స్ అస్సలు క్లిక్ చేయకూడదు. వాటిని వెంటనే డిలిట్ చేయడం మంచిది.
Also Read: Marriage Days are Back: పెళ్లి కళ వచ్చేసింది.. మే, జూన్లో ముహూర్తాల క్యూ