Tripura CM: త్రిపుర నూతన సీఎం మాణిక్ సాహా…!

త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ మాణిక్ సాహా ఎంపికయ్యారు.

  • Written By:
  • Publish Date - May 14, 2022 / 07:42 PM IST

త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ మాణిక్ సాహా ఎంపికయ్యారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం భేటీ అయిన బీజేఎల్పీ భేటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాణిక్ సాహా ను తమ అధినేతగా ఎన్నుకున్నారు. బీజేపీ త్రిపుర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాణిక్ సాహా..ఆపార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగుతున్నారు.
వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి బిప్లవ్ కుమార్ రాజీనామా చేశారు. బిప్లవ్ రాజీనామా చేసిన తర్వాత భేటీ అయిన బీజేఎల్పీ సమావేశంలో  మాణిక్ సాహాను ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొత్త సీఎంగా ఎన్నుకున్నారు.