Samantha Shed Tears : స్టేజ్‌పై సమంత కన్నీరు

నటి సమంత భావోద్వేగానికి గురయ్యారు. మయోసైటిస్‌ కారణంగా ఎంతో కాలం నుంచి మీడియాకు

నటి సమంత (Samantha) భావోద్వేగానికి గురయ్యారు. మయోసైటిస్‌ కారణంగా ఎంతో కాలం నుంచి మీడియాకు దూరంగా ఉన్న ఆమె సోమవారం మధ్యాహ్నం ‘శాకుంతలం’ (Shaakuntalam) ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు .. గుణ శేఖర్ మాటలకు కన్నీరు పెట్టుకున్న సమంత (Samantha) ఓపిక లేకపోయినా వచ్చాను..

‘‘ఈ క్షణం కోసం ఎన్నో రోజులుగా మేము ఎదురుచూస్తున్నాం. త్వరలో మా సినిమా రిలీజ్‌ కానుంది. గుణశేఖర్‌ మీద ఉన్న గౌరవంతో ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఎలాగైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకుని.. ఓపిక లేకపోయినా బలం మొత్తాన్ని కూడబెట్టుకుని హాజరయ్యాను. కొంతమందికి సినిమా.. వాళ్ల జీవితంలో భాగం. కానీ, గుణశేఖర్‌కు సినిమానే జీవితం. ప్రతి సినిమా మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఆయన ప్రాణం పెట్టి తీశారు. ఆయనపై మీరు చూపించే ప్రేమాభిమానాన్ని చూడాలనుకున్నా. అందుకే వచ్చా.

కథ విన్నప్పుడు సినిమా అద్భుతంగా ఉండాలని సాధారణంగా నటీనటులు ఊహించుకుంటారు. కొన్నిసార్లు ఆ ఊహను దాటి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ‘శాకుంతలం’ చూశాక నాకూ అదే భావన కలిగింది. మాకు సపోర్ట్‌గా నిలిచిన దిల్‌రాజుకు ధన్యవాదాలు. ఇందులో భాగం కావడం నా అదృష్టం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఒక్కటి మాత్రం మారలేదు. సినిమాని నేను ఎంతలా ప్రేమిస్తానో సినిమా కూడా నన్ను అంతలా ప్రేమిస్తోంది. ఈ సినిమాతో మీ ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నా’’ అని సమంత పేర్కొన్నారు.

Also Read:  Sania Mirza : టెన్నిస్ స్టార్ సానియా నికర ఆస్తులు దాదాపు రూ. 200 కోట్లు!!