Krishnam Raju : ప్రారంభ‌మైన రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు అంతిమయాత్ర

సినీన‌టుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభ‌మైంది...

  • Written By:
  • Updated On - September 12, 2022 / 02:02 PM IST

సినీన‌టుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభ‌మైంది. జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న నివాసం నుంచి అంతిమ‌యాత్ర ప్రారంభ‌మైంది. అత్మీయులు, అభిమానులు, కుటుంబ‌స‌భ్యులు ఆయ‌న‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లికేందుకు ఆయ‌న నివాసానికి భారీగా త‌ర‌లివ‌చ్చారు. మొయినాబాద్‌లోని క‌న‌క‌మామిడి ఫాంహౌస్‌లో కృష్ణంరాజు అంత్య‌క్రియలు జ‌ర‌గ‌నున్నాయి. అధికార లాంఛ‌నాల‌తో అంత‌క్రియ‌లు జ‌రిపేందుకు ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సాయంత్ర 4గంట‌ల‌కు అంతిమ‌యాత్ర మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌కి చేర‌కుంటుంది. క్ష‌త్రియ సాంప్ర‌దాయం ప్ర‌కారం ఆయ‌న పార్థివ‌దేహానికి కుటుంబ‌స‌భ్యులు అంత్య‌క్రియలు జ‌ర‌పనున్నారు. కృష్ణంరాజుకి కుమారులు లేక‌పోవ‌డంతో ఆయ‌న త‌మ్ముడు కుమారుడైన‌.. ప్ర‌భాస్ సోదరుడు ప్ర‌భోద్ కృష్ణంరాజుకు త‌ల‌కొరివి పెట్ట‌నున్నారు.