తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య (suicide)కు యత్నించింది ఓ కుటుంబం. జానకంపేట గ్రామానికి చెందిన సాయిలు (40), భార్య రేఖ, ఇద్దరు కుమారులు చరణ్, వరుణ్ లతో కలిసి బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాని (suicide attempt)కి పాల్పడ్డారు.
స్థానికులు గమనించి వీరిని నిజామాబాద్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయిలు మృతిచెందాడు. ప్రస్తుతం రేఖ వెంటిలెటర్ పై ఉంది. ఆమె పరిస్థితి సైతం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వీరికి ఇద్దరు పిల్లలు. పిల్లలు వరుణ్, చరణ్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Telangana Congress: గాంధీభవన్లో అసలేం జరుగుతోంది?