Site icon HashtagU Telugu

Health ATM: యూపీలో 4,600 Health ATMల ఏర్పాటుకు ప్లాన్.. ఏమిటీ? ఎలా?

What Is The Plan To Set Up 4,600 Health Atms In Up How

What Is The Plan To Set Up 4,600 Health Atms In Up How

ATM అంటే .. డబ్బులే గుర్తుకు వస్తాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో Health ATM లు ఏర్పాటు కానున్నాయి. తొలి విడతగా 100 ఆస్పిరేషనల్ బ్లాక్‌లలో మొదటి ఆరోగ్య ATMలు అందుబాటులోకి వస్తాయి. ఇవి BP నుంచి ECG దాకా 20కిపైగా వైద్య పరీక్షలు చేస్తాయి. Health ATM లను హెల్త్ ప్యాడ్ అని పిలుస్తున్నారు. ఇది ఆటో మేటిక్ గా పనిచేసే టచ్ స్క్రీన్ కియోస్క్.

రక్తపోటు, శరీర ద్రవ్యరాశి కూర్పు, శరీర ఉష్ణోగ్రత, సిక్స్ – లీడ్ ECG, ఆక్సిజన్ సంతృప్త స్థాయిలను కూడా Health ATM లలో చెక్ చేసుకోవచ్చు. కేవలం 7 నిమిషాలలో చెకింగ్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత టెస్ట్ రిపోర్ట్ ప్రింటవుట్, వాట్సాప్, ఈ – మెయిల్ , ఎస్ఎంఎస్ ద్వారా రోగికి అందుతాయి. అందుకే దేశవ్యాప్తంగా వీటి గురించి చర్చ జరుగుతోంది. రోగికి తక్షణమే వైద్యం అందించడానికి వైద్యుడు అందుబాటులో లేకుంటే టెలిమెడిసిన్ ద్వారా సంప్రదించే సదుపాయం కూడా ఈ యంత్రంలో ఉంది.

ఇండియా హెల్త్ లింక్‌ (IHL) తో ఒప్పందం

ఉత్తరప్రదేశ్ లోని 4,600 కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇటువంటి ఆరోగ్య ATM లను ఇన్‌స్టాల్ చేయాలని యూపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో దీనికి సంబంధించి ఇండియా హెల్త్ లింక్‌ (IHL) తో యూపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. డయాగ్నస్టిక్ సెంటర్ల కొరత కారణంగా ప్రజలు అనేక కిలోమీటర్లు నడిచి జిల్లా ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా చాలాసార్లు వైద్యులు అందుబాటులో ఉండరు. పరికరాల కొరత ఏర్పడుతుంది. ఇక్కడే ఇలాంటి ఏటీఎంలు వంతెనగా మారనున్నాయి అని పరిశీలకులు చెబుతున్నారు. తమ ప్రాథమిక ఆరోగ్య పరీక్ష చేయించు కోవాలనుకునే వ్యక్తులు కేవలం నడిచి వెళ్లి పరీక్షలు చేయించు కోవచ్చు. కొన్ని సమస్యలు తలెత్తితే, వారు వెంటనే మెషిన్ ద్వారా టెలికన్సల్టేషన్ ద్వారా వైద్యుడిని సంప్రదించే అవకాశం ఉంటుంది.ఆసుపత్రులలో ఏర్పాటయ్యే ఈ ATM లు ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) యొక్క భారాన్ని తగ్గిస్తాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనే తయారీ

ఈ హెల్త్ ఏటీఎం ధర రూ. 4 లక్షలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మెడ్ టెక్ జోన్‌లో తయారు చేయబడుతోంది.  అయితే, యూపీలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి రాబోయే యెయిడా మెడికల్ డివైజ్ పార్క్‌లో దీని తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. హెల్త్ ఏటీఎంలతో
చెన్నైలోని డాక్టర్ మెహతా హాస్పిటల్ , న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో రెండేళ్ల పాటు ట్రయల్స్ నిర్వహించారు. ఇవి ఇచ్చే హెల్త్ రిపోర్ట్స్ ఖచ్చితత్వం 97 శాతానికి పైగా ఉంది.

Also Read:  Preeti: ప్రీతి తరహాలో డాక్టర్ల ఆత్మహత్యలు ఎన్నో..! ప్రభుత్వ నిర్లక్ష్యానికి వైద్యం ఏది?