UP : అత్యాచారం చేస్తుండగా తీసిన ఫోటో..వాట్సాప్ లో స్టేటస్..!!

  • Written By:
  • Updated On - November 13, 2022 / 11:08 AM IST

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. బండాలో ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. ఈ క్రూరత్వానికి పాల్పడుతున్న సమయంలో సెల్ఫీ తీసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. ఆ ఫోటోను వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అటార్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి…ఆ బాలికకు సంబంధించిన ఫొటోను స్టేటస్ గా పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. యువకుడి బారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. అప్పటికే ఆ యువకుడు ఫొటోను వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టాడు. ఆ ఫోటో కాస్త వైరల్ కావడంతో…బాధితురాలు, కుటుంబ సభ్యలతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతకుముందు రోజు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు యువకులు మైనర్ బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేకాదు మొబైల్ లో అత్యాచారా సన్నివేశాలు తీశారు. ఈ విషయం ఎవరికైనా చెప్పితే చంపేస్తామంటూ బెదిరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ రెండు ఘటనలు ఒకే గ్రామంలో జరగడం కలకలం రేపింది.