Venu Swamy: ప్రభాస్ అభిమానులపై మండిపడిన వేణు స్వామి.. నన్ను ఏసుకున్నారు కదరా అంటూ?

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 06:23 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు వేణు స్వామి. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు స్టార్ హీరోల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి లేనిపోని వివాదాలను కాంట్రవర్సీలను కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ల అభిమానులు వేణు స్వామి పై దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు. కాగా ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది. వేణు స్వామి చేసే వ్యాఖ్యలు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి.

కొన్నిసార్లు వేణు స్వామి చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం వివాదంగా మారడం చూస్తూనే ఉన్నాం. బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఇక కెరీర్ ఉండదని గతంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే సలార్ హిట్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామినీ ట్రోల్ చేశారు. ప్రభాస్ పెళ్లి చేసుకోడు అని కూడా వేణు స్వామి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సలార్ చిత్రం రిలీజ్ కి ముందు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. సలార్ చిత్రం ఫ్లాప్ అవుతుందని వేణు స్వామి జోస్యం చెప్పారు. ప్రభాస్ కెరీర్ బాహుబలి చిత్రంతోనే పీక్ కి చేరింది.

బాహుబలి స్థాయికి ఇక ప్రభాస్ చేరుకోలేడు. ఇక కెరీర్ డౌన్ ఫాల్ అవుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ సలార్ చిత్రం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని మాసీ గా చూపించి ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. దీనితో సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ అని అనుకున్నారు. దీనితో వేణు స్వామిని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు. జాతకం పేరుతో ఇష్టం వచ్చినట్లు వాగావ్ కదా.. సలార్ బ్లాక్ బస్టర్ అయింది చూడు అంటూ ఫ్యాన్స్ వేణు స్వామిని ట్రోల్ చేశారు. అయితే సలార్ బిజినెస్ లెక్కలు ఒక్క ఒక్కటి బయట పడేకొద్దీ కలెక్షన్ల వివరాలు కూడా బయట పడ్డాయి. సలార్ చిత్రంతో ఫ్యాన్స్ హ్యాపీ కానీ, వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. నార్త్ ఇండియా, నైజాం ఏరియా తప్ప మిగిలిన చోట్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. బయ్యర్ల నష్టాలని నిర్మాతలు సెట్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీనితో వేణు స్వామి మరోసారి సలార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. సలార్ మూవీ ఫ్లాప్ అని నేను అప్పుడే చెప్పా.. కానీ నన్ను కిందా మీదా ఏసుకున్నారు కదరా.. ఇప్పుడేమైంది అంటూ ఒక సెటైరికల్ పోస్ట్ చేశారు. సలార్ నష్టాలని గుర్తు చేస్తూ వేణు స్వామి ఈ పోస్ట్ పెట్టారు.