777 చార్లీ సినిమాను చూసి కన్నీళ్లు పెట్టిన కర్ణాటక సీఎం!

  • Written By:
  • Updated On - June 14, 2022 / 08:27 PM IST

కన్నడ కథానాయకుడు రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 777 చార్లీ. ఈ సినిమాకు రానా సమర్పకుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ధర్మ అనే వ్యక్తి చిన్నప్పుడు యాక్సిడెంట్లో తల్లిదండ్రులను చెల్లిని కోల్పోయి, నా అనే వాళ్ళు లేకపోవడం తో కాస్త మొరటుగా ప్రవర్తిస్తూ, మందు సిగరెట్, గొడవలు, బీర్లు ఇదే అతనికి నిజంగా బతికేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఒక కుక్క పిల్ల ప్రవేశిస్తే ఆ తర్వాత అతని జీవితం ఎలా మారిపోతుంది అన్న అంశాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇక చాలామంది కుక్కలను ఇష్టపడేవారు ఈ సినిమాను అమితంగా ఇష్టపడుతున్నారు.

ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కోసం బెంగళూరులో ప్రత్యేకంగా ప్రదర్శించారు. అయితే ఈ సినిమాను చూసిన సీఎం బసవరాజ్ ఎమోషనల్ అయ్యారు. ఆ సినిమాలో ఆ కుక్క ను చూడగానే గత ఏడాది మరణించిన తన పెంపుడు కుక్క స్నూబీ గుర్తుకు వచ్చింది అని చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సినిమా తర్వాత ఎమోషనల్ అవుతూ మీడియాతో మాట్లాడారు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాలి అని పిలుపునిచ్చారు. శునకాల పై ఎన్నో సినిమాలు ఉన్నాయని, కానీ ఈ సినిమాలో జంతువుల భావోద్వేగాలను కూడా చూపించారని, ఈ సినిమాలో కుక్క తన కళ్ల ద్వారా భావాలను వ్యక్తీకరిస్తుందని సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా కుక్క చూపించే ప్రేమ నిజంగా ఎలాంటి షరతులు లేని ప్రేమ స్వచ్చమైనది అని బసవరాజ్ వివరించారు.