పులుల మరణాలు ఈ ఏడాది పెరిగాయి. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి నుంచి మార్చి నెల మధ్యలో పులుల మరణాలు ఉంటాయి. అయితే ,
గత రెండు నెలల్లో 30 పులులు (Tigers) దేశ వ్యాప్తంగా చనిపోవటం ఆందోళన కలిగిస్తుంది. అంతే కాదు దాదాపు సగం పులులు వాటి సంరక్షణ కేంద్రాల్లో చనిపోయాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు తెలిపారు. అయితే ఈ మరణాలు సాధారణమైనవే అంటున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ప్రకారం కన్హా, పన్నా, రణతంబోర్, పెంచ్, కార్బెట్, సాత్పురా, ఒరాంగ్, కజిరంగా మరియు సత్యమంగళం వంటి టైగర్ రిజర్వ్లలో ఈ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి.
మొత్తం 30 మరణాలలో 16 మాత్రమే రిజర్వ్ వెలుపల మరణించాయి. అత్యధిక సంఖ్యలో ఇప్పటివరకు 9 పులులు మధ్యప్రదేశ్లో మరణించినట్టు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఏడు పులులు చనిపోయాయి. మరణాలలో ఒక పిల్ల, మూడు నడి వయసు, మిగిలినవి పెద్ద పులులుగా గుర్తించారు. అధికారుల ప్రకారం, జనవరి నుండి మార్చి మధ్య పులుల మరణాలు పెరిగే అవకాశం ఉన్నందున ఈ మరణాలు సాధారణం. “ఈ రెండు రాష్ట్రాల్లో (MP మరియు మహారాష్ట్ర) పులుల మరణాలు ఎక్కువగా ఉండటానికి కారణం వాటిలో ఆరోగ్యకరమైన పులుల జనాభా ఉండడమే. ఈ ఏడాది మరణాల సంఖ్య గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. పులుల (Tigers) జనాభా పెరుగుదలకు అనుగుణంగా, సహజంగా మరణాల సంఖ్య పెరుగుతుంది. NTCA డేటా నుండి, ఏ సంవత్సరంలోనైనా జనవరి మరియు మార్చి మధ్య అత్యధిక సంఖ్యలో పులి మరణాలు సంభవించాయి. ఆ టైంలో భూభాగాలను విడిచిపెట్టి బయటికి వెళ్లే సమయం. కాబట్టి పులుల మధ్య ఘర్షణ జరుగుతుంది. పులుల మధ్య కూడా ప్రాదేశిక ఘర్షణలు ఉన్నాయి. దేశంలో ఏటా 200 పులుల మరణాలు అవాంఛనీయమైనవి కావు, అని NTCA సీనియర్ అధికారిని ఉటంకించారు.
పులుల (Tigers) జనాభా 6% పెరిగింది. కాబట్టి మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని అధికారులు వాదించారు. “పులి మరణాల సంఖ్యను సందర్భం లేకుండా తీసుకోవడం పొరపాటు. పులుల సంఖ్య కూడా పెరుగుతోందని, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పులి సగటు జీవిత కాలం 12 సంవత్సరాలు,’’ అని అధికారి తెలిపారు, ఈ సంవత్సరం కూడా జనాభాలో 6% పెరుగుదల అంచనా వేయబడింది. డేటా ప్రకారం, అత్యధిక సంఖ్యలో మరణాలు సహజ కారణాల వల్ల సంభవించాయి, అయితే వేటాడటం రెండవ అతిపెద్ద కారణంగా పేర్కొనబడింది. 2020లో ఏడు, 2019లో 17, 2018లో 34 వేట కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 30 మరణించడం గమనార్హం.
Also Read: Preeti: ప్రీతి తరహాలో డాక్టర్ల ఆత్మహత్యలు ఎన్నో..! ప్రభుత్వ నిర్లక్ష్యానికి వైద్యం ఏది?