Lakhpati Didi Scheme: లఖ్ పతి దీదీ పథకం అంటే ఏమిటి..?

దేశంలో లక్షపతి దీదీ (Lakhpati Didi Scheme)ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రతి సంవత్సరం కనీసం లక్ష రూపాయలు సంపాదించే లఖపతి దీదీల సంఖ్య కోటి దాటింది.

Published By: HashtagU Telugu Desk
Lakhpati Didi Scheme

Safeimagekit Resized Img (2) 11zon

Lakhpati Didi Scheme: దేశంలో లక్షపతి దీదీ (Lakhpati Didi Scheme)ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రతి సంవత్సరం కనీసం లక్ష రూపాయలు సంపాదించే లఖపతి దీదీల సంఖ్య కోటి దాటింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ‘లఖ్ పతి దీదీలు’ ఉన్నారు. దీని తర్వాత పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ వచ్చాయి. ఈ ప‌థ‌కం గురించి వివరంగా తెలుసుకుందాం.

లక్షద్వీప్‌లో ఒక్క ‘లఖపతి దీదీ’ కూడా లేదు

మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 13.65 లక్షల ‘లఖపతి దీదీలు’ ఉన్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో 10.11 లక్షల మంది, మధ్యప్రదేశ్‌లో 9.54 లక్షల మంది దీదీలు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల గురించి మాట్లాడినట్లయితే.. అండమాన్, నికోబార్ దీవులలో 242 లఖపతి దీదీలు ఉన్నాయి. లక్షద్వీప్‌లో ‘లఖపతి దీదీస‌లు లేరు.

ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో ఎంత‌మంది ‘లఖపతి దీదీలు’ ఉన్నారు..?

ఉత్తరప్రదేశ్‌లో 6.68 లక్షలు, గుజరాత్‌లో 4.94 లక్షలు, తమిళనాడులో 2.64 లక్షలు, కేరళలో 2.31 లక్షలు, మహారాష్ట్రలో 8.99 లక్షలు, రాజస్థాన్‌లో 2.02 లక్షలు, బీహార్‌లో 1.16 లక్షలు, గోవాలో 206 లఖపతి దీదీలు ఉన్నారు. అదే సమయంలో కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో 51723 లఖపతి దీదీలు, జమ్మూ మరియు కాశ్మీర్‌లో 29070 మంది ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల గురించి చెప్పాలంటే.. మేఘాలయలో అత్యధికంగా లక్షపతి దీదీల సంఖ్య 33,856. అదే సమయంలో మిజోరంలో 16087 ‘లఖపతి దీదీస‌లు, మణిపూర్‌లో 12499, నాగాలాండ్‌లో 10494 ఉన్నారు.

Also Read: Balakrishna-Ntr: బాలయ్యపై పోటీకి దిగుతున్న ఎన్టీఆర్.. ఒకేసారి రీ రిలీజ్ కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీస్?

లఖపతి దీదీ పథకం గురించి ప్రధాని మోదీ కల ఏమిటి?

గ్రామాల్లో రెండు కోట్ల మంది లఖ్‌పతి దీదీలను సృష్టించడమే తన కల అని గతేడాది స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ లక్ష్యాన్ని రూ.3 కోట్లకు పెంచారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద, ఈ లక్ష్యాన్ని సాధించడానికి మూడేళ్ల కాలపరిమితిని నిర్ణయించారు. ఈ పథకం కింద మహిళలకు శిక్షణ, వ్యాపారం కోసం ఆర్థిక సహాయం అందిస్తారు. వ్యవసాయం, వ్యవసాయేతర రంగాలలో మహిళలు ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష ఆదాయాన్ని ఆర్జించేలా చేయడం దీని లక్ష్యం.

స్వయం సహాయక సంఘాలకు రూ.7 లక్షల కోట్ల బ్యాంకు రుణం లభించింది

మంత్రిత్వ శాఖ ప్రకారం, 2013-14 నుండి ఇప్పటివరకు స్వయం సహాయక సంఘాలు సుమారు రూ.7 లక్షల కోట్ల విలువైన బ్యాంకు రుణాలు పొందాయి. స్వయం సహాయక సంఘాల ఎన్‌పీఏ 9.58 శాతం కాగా, ఇప్పుడు 1.8 శాతానికి తగ్గింది. బిజినెస్ కరస్పాండెంట్ సఖీల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. UPలో బిజినెస్ కరస్పాండెంట్ సఖీల సంఖ్య 42666, మధ్యప్రదేశ్‌లో 10850, రాజస్థాన్‌లో 10599 ఉన్నారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 22 Feb 2024, 10:50 AM IST