1.5 Crore IT Notices : ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే చాలామంది ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు. అలాంటి వారిపై ఇప్పుడు ఐటీ శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ విధంగా పన్ను కట్టకుండా ఉండిపోతున్న దాదాపు 1.5 కోట్ల మందికి నోటీసులు పంపిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఛైర్మన్ నితిన్ గుప్తా వెల్లడించారు. 1 కోటి రూపాయలకుపైగా విలువ చేసే పన్ను వివాదాల పరిష్కారానికి కర్ణాటకలోని మైసూర్ లో డిమాండ్ మేనెజ్మెంట్ సెంటర్ను 2022లోనే ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పన్ను చెల్లింపుదారులు అంగీకరించిన నిర్దిష్ట సమయంలో వారు ఒక చార్టర్డ్ అకౌంటెంట్, మందిపు అధికారులు, పన్ను చెల్లింపుదారులను ఒక చోట చేరి వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఈ సెంటర్ అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. 2022 నుంచి ఇప్పటివరకు ఈ కేంద్రం 2.50 లక్షల వివాదాలను పరిష్కరించిందని ఆయన తెలిపారు. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న విధంగా రూ.25 వేల వరకు ఉన్న పాత ట్యాక్స్ డిమాండ్ల ఉపసంహరణపై సీబీడీటీ ఓ సర్క్యులర్ జారీ చేయనుందని నితిన్ గుప్తా(1.5 Crore IT Notices) వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
పెద్ద మొత్తంలో ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించే వారు ఇన్కమ్ ట్యాక్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. సరైన అవగాహన లేక కొంతమంది ఇబ్బందులు పడుతుంటారు. కొంత మంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేయడం కంటే డబ్బులను నేరుగా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తే ఐటీ విభాగం గమనించదని భావిస్తారు. కానీ ఆ అంచనా తప్పు. ముఖ్యంగా 6 రకాల లావాదేవీల నిర్వహిస్తున్న సమయంలో ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపే అవకాశం ఉంటుంది.