Supreme Court: కోవిషీల్డ్‌పై విచార‌ణ‌కు అంగీకరించిన సుప్రీంకోర్టు

యాంటీ-కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ దుష్ప్రభావాలకు సంబంధించిన ఆందోళనలకు సంబంధించిన పిటిషన్‌ను విచారించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించింది.

Published By: HashtagU Telugu Desk
Supreme Court

Supreme Court

Supreme Court: యాంటీ-కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ దుష్ప్రభావాలకు సంబంధించిన ఆందోళనలకు సంబంధించిన పిటిషన్‌ను విచారించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. వాస్తవానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో నిపుణుల ప్యానెల్ ద్వారా దుష్ప్రభావాలు, ఇతర ప్రమాదాలు రెండింటినీ పరిశోధించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.

కోవిషీల్డ్‌ను బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భార‌త్‌లో సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. ఈ యాంటీ-కోవిడ్-19 వ్యాక్సిన్‌తో అనుబంధించబడిన అరుదైన దుష్ప్రభావం (కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్)పై ఈ పిటిషన్ దాఖలు చేయబడింది. కేసు విచారణ తేదీని నిర్ణయించలేదు. అయితే ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ కేసును విచారించ‌డానికి అంగీకరించారు.

గత నెలలో ఆస్ట్రాజెనెకా కంపెనీ తన వ్యాక్సిన్ కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడానికి, ప్లేట్‌లెట్ కౌంట్‌ను తగ్గించే పరిస్థితిని కలిగిస్తుందని కోర్టు పత్రాలలో చెప్పింది. మీడియా నివేదికల ప్రకారం.. ఆస్ట్రాజెనెకా తన టీకా అనేక కేసుల్లో మరణాలు, తీవ్రమైన గాయాలకు కారణమైందని బ్రిటన్‌లో అనేక వ్యాజ్యాలను ఎదుర్కొంటోంది. బాధితులు UK హైకోర్టులో 51 కేసుల్లో £100 మిలియన్ల వరకు నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Full Tank: కారు లేదా బైక్ ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై విశాల్ తివారీ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విశాల్ తివారీ వృత్తిరీత్యా న్యాయవాది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ (కోవిషీల్డ్ కేసు) వల్ల కలిగే దుష్ప్రభావాలు, నష్టాలను పరిశోధించడానికి మాజీ డైరెక్టర్ అధ్యక్షతన వైద్య నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ప్రజారోగ్య భద్రతను నిర్ధారించడానికి కూడా సూచనలను జారీ చేయాలని డిమాండ్ చేశారు.

We’re now on WhatsApp : Click to Join

కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ప్రమాద కారకాలను పరిశోధించడానికి, వ్యాక్సిన్ వల్ల కలిగే హానిని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ కోరింది. అంతే కాదు ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల వికలాంగులుగా మారిన లేదా మరణించిన వారికి నష్టపరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఈ పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

  Last Updated: 06 May 2024, 05:02 PM IST