Site icon HashtagU Telugu

Largest Land Owner : మన దేశంలో ప్రభుత్వం తర్వాత అతిపెద్ద ల్యాండ్ ఓనర్.. ఎవరు ?

Largest Land Owner

Largest Land Owner

Largest Land Owner : మనదేశంలో భారత ప్రభుత్వం తర్వాత అత్యధిక భూసంపద ఎవరికి ఉందో తెలుసా ? రియల్ ఎస్టేట్ కంపెనీలకో.. పారిశ్రామికవేత్తలకో భారీగా భూములు లేవు. వాటిని మించిన రేంజ్‌లో ‘క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా’కు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో భారీగా భూములు ఉన్నాయి. 2017 సంవత్సరం వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా ఈవివరాలను వెల్లడించారు. ‘క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా’కు సంబంధించిన వివిధ క్రైస్తవ ట్రస్ట్‌లు, స్వచ్ఛంద సంస్థల  సంఘాల యాజమాన్యంలో భూములు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ క్రైస్తవ మత సందేశాన్ని ప్రచారం చేస్తుంటాయి. ప్రజలకు ఉపయోగడే ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తుంటాయి. ప్రధానంగా విద్య, ఆరోగ్యపరమైన రంగాల్లో పేదలకు క్రైస్తవ మిషనరీలు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి. దేశవ్యాప్తంగా ఉన్న ‘క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా’ భూముల మొత్తం విలువ చాలా ఎక్కువ. ఎంతో తెలుసా ? దాదాపు 20వేల కోట్ల రూపాయలు. ఈ మొత్తం భారతదేశ నావికాదళ బడ్జెట్‌ వ్యయానికి సమానం. మన దేశంలో ప్రభుత్వం తర్వాత ఎక్కువ మందికి జాబ్స్ ఇస్తున్న అతిపెద్ద వ్యవస్థ కూడా ‘క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా’నే(Largest Land Owner) కావడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

Also Read : February 15 Holiday : ఫిబ్రవరి 15 ఐచ్ఛిక సెలవు.. ఎందుకో తెలుసా ?