యస్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్కు సంబంధించిన మినిమం బ్యాలెన్స్ రూల్ను మార్చేసింది. మార్చేసిన రూల్ మే 1 నుంచి అమల్లోకి రానుంది. యస్ బ్యాంక్ ప్రో మాక్స్ సేవింగ్స్ ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్ విలువను రూ.50,000కి మార్చారు. ఒకవేళ అకౌంటులో ఈ బ్యాలెన్స్ లేకుంటే రూ.1000 గరిష్ట ఛార్జీని విధిస్తారు. “ప్రో ప్లస్”, “యస్ రెస్పెక్ట్ SA” “Yes Essence SA” రకం అకౌంట్ల కనీస సగటు బ్యాలెన్స్ పరిమితి రూ. 25,000. ఇది మెయింటైన్ చేయలేనిి వారికి రూ. 750 ఛార్జీ విధిస్తారు. ఇక యస్ బ్యాంకు ప్రో అకౌంటులో మినిమం బ్యాలెన్స్ రూ. 10,000 ఉండాలి. అది లేకుంటే రూ. 750 ఛార్జీ విధిస్తారు.
Also Read : Houthis Attack : భారత్కు వస్తున్న నౌకపై హౌతీల ఎటాక్
హెచ్డీఎఫ్సీ బ్యాంకు
హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీలో పెట్టుబడి పెట్టడానికి లాస్ట్ డేట్ మే 10. ఇందులో ఇన్వెస్ట్ చేసే వారికి పెట్టుబడిపై 0.75 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది. అయితే ఈ ఫిక్సడ్ డిపాజిట్ అనేది సాధారణ ఎఫ్డీకి భిన్నంగా ఉంటుంది. దీనిలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్డీలపై 7.75 శాతం మే వడ్డీ లభిస్తుంది. ఈ స్కీంలో సీనియర్ సిటిజన్లు రూ. 5 కోట్ల దాకా డిపాజిట్ చేయొచ్చు.