ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయ్యింది. తాడేపల్లి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 11న కేబినెట్ ను సీఎం జగన్ విస్తరించనున్నారు. దీనికి సంబంధించి…ఏప్రిల్ 8న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించనున్నారు. కొత్తగా మంత్రి పదవి అవకాశం అందుకోనున్నవారికి…ఒక రోజు ముందుగానే..అంటే ఏప్రిల్ 10న సమాచారం అందించనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత…పాత, కొత్త మంత్రులందరికీ సీఎం జగన్ విందు ఇవ్వనున్నారు.
ఇక ఏపీ మంత్రి వర్గ విస్తరణపై ఎన్నో వార్తలు…రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొట్టాయి. ఓ దశలో సీఎం జగన్…తానే స్వయంగా ఈ విషయం గురించి తన సహచరులకు దిశానిర్దేశం చేశారు. కేబినెట్ విస్తరణ అనేది…ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడే తీసుకున్న నిర్ణయమని గుర్తుచేశారు. ఇక పదవులు పోయినవారికి పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుసాగాలని జగన్ క్లియర్ గా ఎప్పుడో చెప్పారు.
ఆనాటి నుంచి మంత్రి వర్గంలో ఉండేదెవరు…పోయేదెవరు..అంటూ చర్చ ఏపీ రాజకీయాల్లో చాలా హాట్ హాట్ గా సాగింది. 95 శాతం మంది మంత్రులను తప్పించి…కొత్త టీమ్ ను రూపొందించనున్నారన్న ఊహాగాలను కూడా వచ్చాయి. ఇక కొంతమంది మంత్రులు తమ పదవుతు పోయినా పర్వాలేదని..జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఇఫ్పుడు స్పష్టమైన సంకేతాలే వచ్చాయి.