Site icon HashtagU Telugu

Ugadi 2024 : ఉగాది రోజున ఆ మూడు రాశుల వారికి మహర్దశ

Ugadi 2024

Ugadi 2024

Ugadi 2024 : ఉగాది పండుగ ఏప్రిల్ 09న రాబోతోంది. ఉగాది(Ugadi 2024) నుంచి ప్రారంభయ్యేది శ్రీ క్రోధినామ సంవత్సరం. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈసారి ఉగాది విశేషం ఏమిటంటే.. దాదాపు 30 ఏళ్ల తర్వాత పండుగ రోజున  అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, శష్ రాజయోగం ఏర్పడుతున్నాయి. వీటివల్ల మూడు రాశులవారు లాభపడుతారని పండితులు అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

వృషభ రాశి  

వృషభ రాశివారికి శ్రీ క్రోధినామ సంవత్సరం కలిసొస్తుంది. స్థిరాస్తులు కొంటారు. ఉన్నత పదవులు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ప్రారంభించిన కార్యాలు సక్సెస్ అవుతాయి. శని శుభస్థానంలో, గురుడు సంవత్సరం మొత్తం జన్మంలో ఉండడంతో వల్ల  ఈ రాశి వారికి అనుకూల సమయం కంటిన్యూ అవుతుంది. అపనిందలు, అపవాదులు ఎదుర్కోవాల్సి రావచ్చు. వాహన ప్రమాదాల గండం ఉంది.

Also Read : Lottery King No 1 : రూ.1,368 కోట్ల ఎలక్టోరల్​ బాండ్లు​ కొన్న ‘లాటరీ కింగ్​’ ఎవరు ?

Also Read :Megha 966 Crores : ‘మేఘా’ రూ.966 కోట్ల విరాళాలు.. తెలుగు కంపెనీల చిట్టా ఇదిగో

మకరరాశి

మకర రాశి వారు కొత్త ఏడాదిలో ఎన్నో ప్రయోజనాలు పొందబోతున్నారు. మీరు భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీ సంపద వృద్ధి చెందుతుంది. మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు.

మేషరాశి

హిందూ నూతన సంవత్సరం మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. వీరి ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీరు మీపై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు లాభపడతారు. మీరు ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది.