AP Crisis: సంక్షోభం అంచున ఏపీ…మేలుకోకుంటే దారుణ పరిస్థితులు-‘ది ప్రింట్’సంచలనాత్మక కథనం..!!

ఆంధ్రప్రదేశ్ గురించి ప్రముఖ మీడియా హౌస్ ‘ది ప్రింట్’సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఏపీ సహా దేశంలో మరికొన్ని రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారాయని పేర్కొంది.

  • Written By:
  • Updated On - April 25, 2022 / 12:41 AM IST

ఆంధ్రప్రదేశ్ గురించి ప్రముఖ మీడియా హౌస్ ‘ది ప్రింట్’సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఏపీ సహా దేశంలో మరికొన్ని రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులుద దారుణంగా ఉన్నాయని రాసుకొచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకోవాలని…లేదంటే పంజాబ్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తప్రదేశ్ రాష్ట్రాలకు శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభం తప్పదని రాసింది. నిజానికి కోవిడ్ కంటే రెండేళ్ల ముందు నుంచి అంటే 2018-19ఆర్థిక సంవత్సరం నుంచే ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారడం మొదలైందని ది ప్రింట్ పేర్కొంది.

రాష్ట్రాల సొంత ఆదాయం తగ్గిపోవడంతో…అప్పులపై ఆధారపడుతున్నాయని తెలిపింది. వీటికి తోడుగా కేంద్ర ప్రభుత్వ ఉజ్వల్ సెంటర్ డిస్కం ఎస్యూరెన్స్ యోజన కూడా ఈ పరిస్థితులకు కారణమని వివరించింది. ఆయా రాష్ట్రాల్లోని ఇతర అంశాలు కూడా వాటి ఆర్థిక పరిస్థితి దిగజారేందుకు కారణమయ్యాయని పేర్కొంది. ఇక నిజానికి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గత ఐదు సంవత్సరాల్లో రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల కంటే చెల్లింపుల్లో పెరుగుదలే ఎక్కువగా ఉందంటూ కాగ్ నివేదికలు బయట పెట్టాయి. ఫలితం అప్పులు ఊబిలో చిక్కుకున్న రాష్ట్రాలు వాటిని తీర్చలేకపోతున్నాయంటూ తెలిపింది.

కాగా ఈ మధ్య ఎలక్షన్స్ జరిగిన రాష్ట్రాలైనా పంజాబ్, యూపీ, లలో ఎన్నో ప్రజాలను ఆకర్షించే పథకాలు ప్రకటించారు. ప్రస్తుత అప్పులకు అవికూడా తోడైయినట్లయితే…పరిస్థితి మరింత అధ్వన్నంగా మారుతుందని పేర్కొంది. పంజాబ్ పరిస్థితి గురించి వివరిస్తూ…మరింత దారుణంగా ఉందని…నాలుగేళ్లలో పంజాబ్ రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల రేటు 9శాతం ఉంటే వడ్డీచెల్లింపు రేటు 3శాతం పెరిగిందని పేర్కొంది. GSDPలో 53శాతం అప్పులు చేసిన పంజాబ్ పరిస్థితి దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే దారుణంగా ఉందని పేర్కొంది.

అటు ఉత్తరప్రదేశ్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉందని..ఏపీ, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అప్పులు మరీ దారుణంగా పెరిగిపోయాయి. ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం అప్పులు రూన 3.89లక్షలకు కోట్లకు చేరుకోగా…అంతకుముందు ఏడాదితోపోల్చితే రూ. 40వేల కోట్లు అధికం. ఏపీ GSDPలో అప్పు 32.4 శాతానికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న మొత్తం చెల్లింపులు భారం రూ. 7.76లక్షల కోట్లు కూడా లెక్కల్లోకి తీసుకున్నట్లయితే GSDPలో మన భారాలా వాటా76 శాతంగా ఉంటుదని నిపుణులు అంటున్నారు.

దీని ప్రకారం చూసుకున్నట్లయితే పంజాబ్ కంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులపై కేంద్రం ఆంక్షలు విధిస్తే రాష్ట్రం పరిస్థితి ఏమౌతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. మూడు ఏండ్లుగా ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలేదు. కాంట్రాక్టర్లు, సరఫరాదారులు, ప్రభుత్వ ఉద్యగులకూ పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఏపీ తీరుపై ఆర్థిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.