Site icon HashtagU Telugu

Forced To Drink Urine : ఇద్దరు పిల్లలతో మూత్రం తాగించి.. ఆ పార్ట్స్ లో మిరపకాయలు రుద్దారు!

Forced To Drink Urine

Forced To Drink Urine

Forced To Drink Urine :  మరో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. 

ఒక చికెన్ షాప్ లో 2వేల రూపాయలు దొంగతనానికి గురయ్యాయి.. 

ఆ ఏరియాకు చెందిన ఇద్దరు పిల్లలపై  షాపు నిర్వాహకులకు అనుమానం వచ్చింది. 

దీంతో టీ ఇస్తామని ఆశజూపి.. వారిద్దరిని షాపులోకి పిలిచి స్తంభానికి కట్టేశారు..

చికెన్ షాప్ నిర్వాహకులు అంతటితో ఊరుకోలేదు..

పిల్లలు అని కూడా చూడకుండా.. వాళ్ళను క్రూరంగా టార్చర్ చేశారు..

Also read : Ileana D’Cruz: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లా పత్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంకటి చౌరాహా సమీపంలోని అర్షన్ చికెన్ షాప్ లో  ఆగస్టు 4న ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది . ఈ రాక్షస చేష్టలకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.

Also read : Japan Vs Russia : ఖబడ్దార్ రష్యా.. అణుబాంబు వార్నింగ్స్ ఆపేయ్

అసలేం జరిగింది.. 

బాధిత పిల్లల్లో ఒకరి వయసు 7 సంవత్సరాలు, మరొకరి వయసు 15 సంవత్సరాలు. దొంగతనం చేశారనే ఆరోపణతో చికెన్ షాపు నిర్వాహకులు ఆ ఇద్దరు బాలుర చేతులను వెనక్కి మలిచి స్తంభానికి కట్టేశారు. వాళ్ళ  బట్టలు విప్పేసి.. మూత్రనాళం, మలద్వారం దగ్గర  పచ్చి  మిరపకాయలను రుద్దారు. ఈక్రమంలో నొప్పితో అరుస్తున్న అబ్బాయిలకు పెట్రోల్ తో నీడిల్స్ నింపి ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆ బాలురను భయపెట్టి బాటిల్ లో పట్టి తెచ్చిన మూత్రాన్ని(Forced To Drink Urine) తాగించారు. ఈక్రమంలో పిల్లల్ని పచ్చి బూతులు తిట్టారు.  ఈ ఘటనలో అదుపులోకి తీసుకున్న ఆరుగురు నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీలో  ఎనిమిది మంది పేర్లను నమోదు చేశారు. ప్రధాన నిందితులు ఇద్దరు ఇంకా పరారీలో ఉన్నారు.