Israel Vs Syria : సిరియాపై ఇజ్రాయెల్ ఎటాక్.. 44 మంది మృతి

Israel Vs Syria :  ఇజ్రాయెల్ దళాలు సిరియాపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి.

  • Written By:
  • Publish Date - March 30, 2024 / 08:20 AM IST

Israel Vs Syria :  ఇజ్రాయెల్ దళాలు సిరియాపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. సిరియాలోని అతిపెద్ద నగరమైన అలెప్పోపై జరిగిన ఈ దాడిలో మొత్తం 44మంది మృతిచెందారు. చనిపోయిన వారిలో 36 మంది సైనికులే ఉన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలయ్యాక సిరియా సైన్యానికి ఈ స్థాయి ప్రాణనష్టం జరగడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. లెబనాన్ దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు  అలెప్పో విమానాశ్రయం సమీపంలో క్షిపణి నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వాటిని  లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఈ దాడులు చేసిందని సమాచారం. ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూపులకు చెందిన సైనిక ఉత్పత్తుల ఫ్యాక్టరీలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడులను సిరియా సైన్యం(Israel Vs Syria) కూడా ధ్రువీకరించింది.

We’re now on WhatsApp. Click to Join

ఇజ్రాయెల్‌, సిరియాలోని తిరుగుబాటు దళాలు ఏకకాలంలో దాడులు చేశాయని వెల్లడించింది. ఈ దాడిలో మరణించిన వారిలో ఏడుగురు హిజ్బుల్లా ఉగ్రవాదులు, ఒక సిరియా పౌరుడు కూడా ఉన్నారని తెలిపింది. అయితే ఈ దాడుల గురించి ఇజ్రాయెల్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. సిరియా రాజధాని డమస్కస్‌ శివార్లలోనూ ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు చనిపోయారు. హిజ్బుల్లా సహా ఇరాన్‌ మద్దతుగల మిలిటెంట్ గ్రూపులకు సిరియాలో ప్రధాన స్థావరంగా నిలుస్తున్న సయ్యిదా జైనబ్‌ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది.

Also Read :Daniel Balaji : తెలుగు మూలాలున్న కోలీవుడ్ విలన్ క‌న్నుమూత‌

రంజాన్‌ నెల సందర్భంగా పాలస్తీనాలోని గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఇటీవలే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి డిమాండ్​ చేసింది. దీంతోపాటు బందీలను హమాస్ విడుదల చేయాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఐరాస భద్రతా మండలిలోని మొత్తం 15 సభ్య దేశాలకుగానూ 14 ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి.  ఇజ్రాయెల్‌పై తొలిసారిగా ఒత్తిడిని పెంచేందుకుగానూ ఈ ఓటింగ్ నుంచి అమెరికా దూరంగా ఉండిపోయింది.

Also Read :Exit Polls : నో ‘ఎగ్జిట్‌ పోల్స్‌’.. ఈసీ కీలక ప్రకటన