Jyotish Peeth : జ్యోతిష్ పీఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద పట్టాభిషేకంపై సుప్రీంకోర్టు స్టే…అసలేం జరిగిందంటే..?

ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానందుని పట్టాభిషేకంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Published By: HashtagU Telugu Desk
Avimuktesvranand

Avimuktesvranand

ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానందుని పట్టాభిషేకంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ బిని నాగరత్నలతో కూడిన బెంజ్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. పూరీలోని గోవర్ధన్ మఠానికి చెందిన శంకరాచార్య అఫిడవిట్ దాఖలు చేసినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలియజేశారు. దీంతో ధర్మాసనం పట్టాభిషేకంపై నిషేధం విధించింది.

స్వామి స్వరూపానంద సరస్వతి మరణానంతరం జ్యోతిష్పీఠానికి చెందిన శంకరాచార్యను తన వారసుడిగా నియమించినట్లు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి తప్పుగా చెప్పారని స్వామి వాసుదేవానంద సరస్వతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జ్యోతిష్ పీఠ్ కొత్త శంకరాచార్యగా అవిముక్తేశ్వరానంద నియామకాన్ని ఆమోదించలేదని అఫిడవిట్ లో పేర్కొంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కొనసాగుతున్న ఈ కేసును అనవసరంగా మార్చేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు చేస్తున్నారని..అనర్హులు అసమంజసమైన రీతిలో శంకరాచార్యులు అవుతారని కూడా దరఖాస్తులో పేర్కొన్నారు. అలాంటి ప్రయత్నాలను కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ఆపాల్సిన అవసరం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.

కొత్త శంకరాచార్యుల నియామకం అబద్దమని…ఇది అంగీకరించిన నియామక ప్రక్రియను ఉల్లంఘించడమే అవుదంటూ పేర్కొంటూ..తగిన గౌరవంతో ఇలాంటి పత్రాలు కూడా సమర్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. హోదా,చిరునామాను ఉపయోగించకుండా అవిముక్తేశ్వరానంద్‌ను అడ్డుకోవాలంటూ పిటిషనర్ డిమాండ్ చేశారు. గొడుగు లేదా సింహాసనం కూడా ధరించేందుకు పర్మిషన్ ఇవ్వకూడదంటూ పేర్కొన్నారు. పిటిషనర్ తన వాదనకు సంబంధించిన కొన్ని పత్రాలను కూడా సమర్పించారు. వాటి ఆధారంగా కొత్త శంకరాచార్య నియామకం సరైనది కాదని, ఇది నియామకం ఆమోద ప్రక్రియను పూర్తిగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 18 విచారణకు రానుంది.

వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం, హిందూ పండితుల ప్రకారం, శంకరాచార్య లేకుండా వెన్ను ఉండదు. హిందూమతం అద్వైత వేదాంత సంప్రదాయంలో, శంకరాచార్య అనేది మఠాల అధిపతులకు సాధారణంగా ఉపయోగించే పదం. ఆదిశంకరాచార్యులు ఉత్తరాన బదరికాశ్రమ జ్యోతిష్ పీఠాన్ని, పశ్చిమాన ద్వారక శారదా పీఠాన్ని, తూర్పున పూరీలోని గోవర్ధన్ పీఠాన్ని, కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించారని నమ్ముతారు. ఇవి మొత్తం నాలుగు మఠాలు.

  Last Updated: 16 Oct 2022, 04:46 AM IST